నోటికి ఎంత మాట వస్తే.. అంత అనేస్తున్న వైసీపీ నాయకులు. నాలుగు గోడల మధ్యమాట్లాడుకోవాల్సిన వ్యాఖ్యలను కూడా బహిరంగ వేదికలపై నోరు జారేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు. సంక్షేమ పథకాల కింద వేలకు వేలు ఇస్తున్నాం.. మాకు కాకుండా ఎవరికి ఓటేస్తారు. అసలు అంత దమ్ము ఎవరికి ఉంది! అని సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యానించే సరికి సభలో ఉన్నవారంతా అవాక్కయ్యారు.
తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలే తమకు ఓటు వేస్తారని అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్ నడిసముద్రంలో చిక్కుకున్నారని, ఆయన్ని మీరే దాటించాలని జనాన్ని కోరారు. సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు వస్తే కార్యకర్తలుకూడా అదేస్థాయిలో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
ఎవడు బడితే వాడు.. పోస్టులు పెడుతున్నాడు. జగన్ అంటే అంత అలుసా రా.. మీకు. 151 మందిని గెలిపించుకున్న వైసీపీ అంటే.. చులకనారా మీకు! మీ అంతు తేల్చేందుకు మా కార్యకర్తలు కూడా సిద్ధంగానే ఉన్నారు అని చక్రపాణి రెడ్డి నోరు పారేసుకున్నారు. ఇక, ఇదే కార్యక్రమంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ బీజేపీ విధానాల వల్లే పెట్రోలు, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగాయని, అయితే ప్రతిపక్షాలు బీజేపీపై తిరుగుబాటు చేయకుండా తమపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
ప్లీనరీ సమావేశంలో ముఖ్యనేతలు మాట్లాడే సమయానికి జనం వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. రామసుబ్బారెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడే సమయానికి ఎక్కువ శాతం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఒక్కపూట తినకపోతే ఏమవుతుంది... ఆగండి అంటూ ఎమ్మెల్యే శిల్పా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కార్యక్రమం చప్పగా సాగుతుండగా చప్పట్లు కొట్టమని జనాన్ని అడిగినా స్పందన రాలేదు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…