జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. జగన్ దిగిన హెలిప్యాడ్ దగ్గరకు మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. కొందరు చోటా మోటా నేతలు కూడా వెళ్ళారు. అయితే కేంద్ర మాజీమంత్రిగా పనిచేసిన డాక్టర్ కిల్లి కృపారాణి పేరు మాత్రం ప్రోటోకాల్ జాబితాలో నుండి మయమైపోయిందట. అందుకనే హెలిప్యాడ్ దగ్గరకు వెళ్ళేందుకు అనుమతిలేదని పోలీసులు స్పష్టంగా చెప్పేశారు.
తనకు అవమానం జరిగిందని మండిపోయిన కిల్లి అక్కడినుండి వెళ్ళిపోయారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్ఏ ధర్మాన కృష్ణదాస్ ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా వినకుండా ఆమె వెళ్ళిపోయారు. సరే ఇలాంటి ప్రోటోకాల్ వివాదాలు నడుస్తునే ఉంటాయి కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కిల్లికి ఉన్న స్టేచర్ ఏమిటో బయటపడింది. చోటా మోటా నేతలు కూడా హ్యాపీగా సీఎం హెలికాప్టర్ దగ్గరకు వెళ్ళి రిసీవ్ చేసుకోగలిగినపుడు కిల్లిని మాత్రమే పోలీసులు ఎందుకు అనుమతించలేదు. శ్రీకాకుళం ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కిల్లి మామూలు నేతకాదు కదా. అయినా పోలీసులు ఆపేశారంటే ఆమెకు స్టేచర్ లేదనే అర్ధమవుతోంది.
మామూలుగా అయితే ఇలాంటి వాళ్ళకి ప్రోటోకాల్ లో పేరుందా లేదా అని పోలీసులు చూడరు. కేంద్ర మాజీమంత్రి అందులోను అధికారపార్టీ నేత కాబట్టి అడ్డుచెప్పకుండా వదిలేస్తారు. అయినా సరే పోలీసులు ఆపేశారంటేనే ఆమెకున్న స్టేచర్ ఏమిటో అర్ధమైపోతోంది. ఏదో కాంగ్రెస్ గాలిలో గెలిచిపోయి అదృష్టం కొద్ది మంత్రయిపోయారు. నియోజకవర్గంలో పట్టులేదు, కార్యకర్తల బలం లేదు. అయినా సరే తనను తాను చాలా పెద్ద నేతగా చెప్పుకుంటుంటారు.
ఇక్కడే ఆమెతో సమస్య వస్తోంది. పార్టీలో చేరింది కూడా చాలా ఆలస్యంగా చేరారు. అలాంటిది చేరిన వెంటనే శ్రీకాకుళం లోక్ సభ టికెట్ కావాలని పట్టుబట్టారు. ఇవ్వకపోయేటప్పటికి ఈమధ్య రాజ్యసభ కావాలని అడిగారు. ముందు జనాల్లో పట్టుపెంచుకుంటే అన్నీ అవే వస్తాయి కాని ప్రోటోకాల్ వివాదాన్ని పెద్దది చేసుకుంటే ఏటొస్తది ?
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…