టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన గడ్డపైనే ఆయనకు ఘోర అవమానం జరిగింది. మరో రెండు రోజుల్లో ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీ కార్యకర్తలు.. కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టి.. ఏదో ఒక విధంగా ఇక్కడ రసాభాస సృష్టించాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు వైసీపీ కార్యకర్తలు.. ఆ పార్టీ జెండా రంగులు వేయడం సంచలనంగా మారింది.
చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలో బొమ్ములూరు ఉంది. ఇక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు రాత్రికి రాత్రి వైసీపీ రంగులు వేశారు. దీంతో విషయం తెలుసుకొని బొమ్ములూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నాయకులు పరిసరాలను గమనించారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసిపి రంగులు వేయడాన్నివారు తీవ్రంగా ఖండించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న వైసిపి రంగులు చెరిపి వేసి టీడీపీ జెండా రంగులు వేయించారు.
ఇదిలావుంటే.. స్థానిక ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులే దీనికి పాల్పడ్డారని.. టీడీపీ నేతలు ఆరోపించారు. నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. మహానాడు బ్యానర్ల పై, అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.
తమ నాయకుడు విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గమని, మినీ మహానాడును ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడంతోపాటు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే చర్యల్లో ఇది భాగమేనని దుయ్యబట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు నేతలు తెలిపారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…