Political News

ఎన్టీఆర్ విగ్ర‌హానికి వైసీపీ రంగులు..

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ‌పైనే ఆయ‌న‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. మ‌రో రెండు రోజుల్లో ఇక్క‌డ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఉన్న నేప‌థ్యంలో అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. టీడీపీ నేత‌ల‌ను రెచ్చ‌గొట్టి.. ఏదో ఒక విధంగా ఇక్క‌డ ర‌సాభాస సృష్టించాల‌నే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ఆ పార్టీ జెండా రంగులు వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలో బొమ్ములూరు ఉంది. ఇక్క‌డున్న ఎన్టీఆర్ విగ్ర‌హానికి కొంద‌రు రాత్రికి రాత్రి వైసీపీ రంగులు వేశారు. దీంతో విషయం తెలుసుకొని బొమ్ములూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇత‌ర నాయ‌కులు ప‌రిస‌రాల‌ను గ‌మ‌నించారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసిపి రంగులు వేయడాన్నివారు తీవ్రంగా ఖండించారు. అనంత‌రం విగ్ర‌హానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న వైసిపి రంగులు చెరిపి వేసి టీడీపీ జెండా రంగులు వేయించారు.

ఇదిలావుంటే.. స్థానిక ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని అనుచ‌రులే దీనికి పాల్ప‌డ్డార‌ని.. టీడీపీ నేత‌లు ఆరోపించారు. నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నార‌ని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమ‌ర్శించారు. మహానాడు బ్యానర్ల పై, అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.

తమ నాయకుడు విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గ‌మ‌ని, మినీ మ‌హానాడును ఉద్దేశ పూర్వ‌కంగా అడ్డుకోవ‌డంతోపాటు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునే చ‌ర్య‌ల్లో ఇది భాగ‌మేన‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు నేత‌లు తెలిపారు.

This post was last modified on June 27, 2022 10:02 pm

Share

Recent Posts

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

35 minutes ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

1 hour ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

1 hour ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

1 hour ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

1 hour ago

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

4 hours ago