Political News

దూకుడు మీదున్న రేవంత్

ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవటంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉన్నాడు. వచ్చే ఏప్రిల్, మేనలలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, జూన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవటం ఖాయమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలను రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరటానికి చాలామంది నేతలు ఆసక్తిగా ఉన్నారన్నారు.

ముఖ్యంగా కేసీయార్ ఒంటెత్తు పోకడలు నచ్చని చాలామంది టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు బాగా ఉత్సాహం చూపిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ ప్రధానంగా ఒకపుడు కాంగ్రెస్ లో పనిచేసి తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీలోకి వెళ్ళిపోయిన కొందరు నేతలు కూడా తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. అంటే ఏకకాలంలో ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీలో నుండి నేతలను కాంగ్రెస్ లోకి రేవంత్ లాగేస్తున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుండి నేతలను లాగేసుకునేందుకు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వివిధ జిల్లాల్లో పై రెండు పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపైన కమలం పార్టీ దృష్టిపెట్టింది. ఎవరికి అవకాశముంటే వాళ్ళని పార్టీలోకి లాగేసుకోవటమే టార్గెట్ గా బీజేపీ చీఫ్ బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీల్లోని గట్టి నేతలను లాగేసుకుంటే కానీ బీజేపీకి వచ్చే ఎన్నికల్లో చాలాచోట్ల అభ్యర్ధులు దొరకరు. కానీ కాంగ్రెస్ పరిస్ధితి అలాకాదు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులే ఉన్నారు.

కాకపోతే పార్టీలోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, టీఆర్ఎస్ కు మద్దతుగా కోవర్టులుగా పనిచేసే నేతలు ఎక్కువగా ఉండటం వల్లే చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడిపోతున్నారు. దీనికి విరుగుడుగా రేవంత్ కోవర్టులను ఏరేసే పనిని పెట్టుకున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక చాలా జాగ్రత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా రేవంత్ అయితే మంచి దూకుడుమీద వెళుతున్నారు.

This post was last modified on June 27, 2022 2:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

4 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

8 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

9 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

12 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

13 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

13 hours ago