ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవటంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉన్నాడు. వచ్చే ఏప్రిల్, మేనలలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, జూన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవటం ఖాయమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలను రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరటానికి చాలామంది నేతలు ఆసక్తిగా ఉన్నారన్నారు.
ముఖ్యంగా కేసీయార్ ఒంటెత్తు పోకడలు నచ్చని చాలామంది టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు బాగా ఉత్సాహం చూపిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ ప్రధానంగా ఒకపుడు కాంగ్రెస్ లో పనిచేసి తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీలోకి వెళ్ళిపోయిన కొందరు నేతలు కూడా తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. అంటే ఏకకాలంలో ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీలో నుండి నేతలను కాంగ్రెస్ లోకి రేవంత్ లాగేస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుండి నేతలను లాగేసుకునేందుకు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వివిధ జిల్లాల్లో పై రెండు పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపైన కమలం పార్టీ దృష్టిపెట్టింది. ఎవరికి అవకాశముంటే వాళ్ళని పార్టీలోకి లాగేసుకోవటమే టార్గెట్ గా బీజేపీ చీఫ్ బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీల్లోని గట్టి నేతలను లాగేసుకుంటే కానీ బీజేపీకి వచ్చే ఎన్నికల్లో చాలాచోట్ల అభ్యర్ధులు దొరకరు. కానీ కాంగ్రెస్ పరిస్ధితి అలాకాదు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులే ఉన్నారు.
కాకపోతే పార్టీలోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, టీఆర్ఎస్ కు మద్దతుగా కోవర్టులుగా పనిచేసే నేతలు ఎక్కువగా ఉండటం వల్లే చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడిపోతున్నారు. దీనికి విరుగుడుగా రేవంత్ కోవర్టులను ఏరేసే పనిని పెట్టుకున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక చాలా జాగ్రత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా రేవంత్ అయితే మంచి దూకుడుమీద వెళుతున్నారు.
This post was last modified on June 27, 2022 2:33 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…