Political News

రాష్ట్రపతి పాలన తప్పదా ?

సంక్షోభంలో కూరుకుపోతున్న మహారాష్ట్ర రాజకీయాలకు రాష్ట్రపతి పాలన ఒకటే మార్గమా ? క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మామూలుగా అయితే సంక్షోభంలో నుండి బయటపడేందుకు ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే పార్టీపరంగా పావులు కదపాలి. ఒకవైపు ఆ ప్రయత్నాలు జరుగుతుండగానే గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ యాక్టివ్ అయిపోయారు. ఖోషియారీకి ముఖ్యమంత్రికి మధ్య ఏ మాత్రం పడటంలేదు.

థాక్రేని ఇబ్బందులు పెట్టడమే టార్గెట్ గా గతంలో కూడా చాలాసార్లు గవర్నర్ పావులు కదిపారు. ఎంత చిన్న అవకాశం వచ్చినా గవర్నర్ వెంటనే యాక్టివ్ అయిపోతున్నారు. అలాంటిది ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోతే చూస్తూ కూర్చుంటారా ? అందుకనే సీఎంకు ప్యారలెల్ గా గవర్నర్ కూడా రాజకీయం మొదలు పెట్టేశారు. తిరుగుబాటు ఎంఎల్ఏలను దారికి తెచ్చుకునేందుకు ఎంఎల్ఏలతో పాటు వాళ్ళ కుటుంబాలకు కల్పించిన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించింది.

వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని ఎంఎల్ఏలతో పాటు వాళ్ళ కుటుంబాలకు కూడా భద్రతను మళ్ళీ కల్పించారు. సంక్షోభం విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం అందుకునేందుకు డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. గవర్నర్ అంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే. కాబట్టి థాక్రేకి వ్యతిరేకంగానే గవర్నర్ పావులు కదుపుతారనటంలో సందేహంలేదు.

సంక్షోభం మరో రెండు రోజులు ఇలాగే కంటిన్యూ అయితే కచ్చితంగా గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రపతి పాలన విధించేందుకు వీలుగా తిరుగుబాటు ఎంఎల్ఏలకు మద్దతుగా బీజేపీ తెరవెనుక నుండి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధిస్తే కానీ బీజేపీకి పట్టు రాదు. మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉన్నంతకాలం బీజేపీ చేయగలిగేదేమీలేదు. అందుకనే వెంటనే రాష్ట్రపతి పాలన విదించేస్తే పాలన మొత్తం గవర్నర్ చేతిలోకి వెళిపోతుంది. అప్పుడు బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాట. కాబట్టి సంక్షోభం కంటిన్యు అవ్వాలని బీజేపీ వెంటనే పరిష్కారం అవ్వాలని శివసేన కోరుకుంటున్నాయి. అయితే వెంటనే పరిష్కారమయ్యే అవకాశాలున్నాయా ?

This post was last modified on June 27, 2022 1:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

4 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

8 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

9 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

12 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

13 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

14 hours ago