Political News

నేపాల్ కూడా భారత్ భూమిని కబ్జా చేసిందా ?

భారత్ భూభాగాన్ని కబ్జా చేయాలని ఒకవైపు దాయాది దేశం పాకిస్తాన్, మరోవైపు డ్రాగన్ దేశం చైనా 24 గంటలు 365 రోజులూ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పై రెండు దేశాలు వివిధ సందర్భాల్లో వేలాది కిలోమీటర్లను ఆక్రమించేశాయి. పీవోకే అంటే పాక్ ఆక్యుపెయిడ్ కాశ్మీర్ రూపంలో సుమారు 2500 కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ తన కబ్జాలో దశాబ్దాలుగా అట్టే పెట్టేసుకున్నది. పై రెండు దేశాల దురాక్రమణలు అందరికీ తెలిసిందే.

అయితే చడీ చప్పుడు లేకుండా మరో దేశం నేపాల్ కూడా ఇండియా భూభాగాన్ని ఆక్రమించేసింది. ఆక్రమించేసిన భూమి 5 హెక్డార్లే అయినా అసలు నేపాల్ కూడా భూ కబ్జాకి పాల్పడటమే విచిత్రంగా ఉంది. పాకిస్ధాన్, చైనా తో అంటే మన దేశానికి అనేక సమస్యలున్నాయి. చైనాతో జరిగిన యుద్ధం సమయంలో భారత్ ఓడిపోయింది కాబట్టి అప్పట్లో వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని వాళ్ళే సొంతం చేసుకున్నారు.

అలాగే పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారతే గెలిచినప్పటికీ అప్పటి కారణాల వల్ల వాళ్ళని మన భూభాగం నుండి తరిమేయలేదు. పైగా వాళ్ళ ఆధీనంలోని భూమిని కేంద్ర ప్రభుత్వం విడిపించలేదు. అప్పట్లోనే పాకిస్ధాన్ సైన్యాలను తరిమేసుంటే సరిపోయేది. అలా కాదని చర్చలని, మరోటని ప్రయత్నాలు చేసేటప్పటికి పాకిస్తాన్ బిగదీసుకుని కూర్చుని మొత్తం భూమిని కబ్జా చేసేసింది. కాలక్రమంలో తన ఆధీనంలోని భూమిని చైనాకు పాకిస్తాన్ దారాదత్తం చేసింది.

సరే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే నేపాల్ కు ఏమైందో అర్థం కావటం లేదు. భారత్-నేపాల్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా నేపాల్ కు ఇతర దేశాల భూభాగాలను కబ్జా చేసిన చరిత్ర లేదు. ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతంలో చంపావత్ అటవీ ప్రాంతముంది. అక్కడి భూమినే నేపాల్ ఆక్రమించినట్లు ఉత్తరాఖండ్ అటవీశాఖ గుర్తించి కేంద్రానికి లేఖ రాసింది. ఇదే విషయమై ఉత్తరాఖండ్ అటవీశాఖ మంత్రి సుబోధ్ ఉనియాల్ మాట్లాడుతూ కబ్జా నిజమే అన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడుతోందని చెప్పారు.

This post was last modified on June 26, 2022 11:18 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

1 hour ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

2 hours ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

3 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

5 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

7 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

9 hours ago