Political News

విరాళాలు సరే మద్దతేది ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. పవన్ తల్లి పార్టీకి లక్ష రూపాయల విరాళమిచ్చారు. అలాగే మరో లక్షన్నర రూపాయలు ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు అందించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు పవన్ జిల్లాల పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆర్ధికంగా ఆదుకోవటం నిజంగా మంచిపనే.

ఈ మధ్యనే పవన్ సోదరుడు నాగబాబు పిల్లలు, సోదరి పిల్లలు నలుగురు కలిసి రు. 35 లక్షల విరాళాన్ని చెక్కుల రూపంలో అందించారు. వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునేందుకే ఖర్చు చేయాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళిస్తున్న కుటుంబ సభ్యులు రాజకీయంగా ఆదుకునేందుకు పవన్ కు ఎందుకు మద్దతివ్వడం లేదు ?

జనసేన పార్టీలో పవన్ కు మద్దతుగా కేవలం నాగుబాబు మాత్రమే యాక్టివ్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నాగబాబుకు చిరంజీవి సోదరుడిగానే తప్ప సొంతంగా అభిమానులు లేరు. అలాగే జనాల్లో పెద్దగా క్రేజు కూడా లేదు. నాగబాబు సినిమా కెరీర్ మొత్తం చిరంజీవి మీదే ఆధారపడుంది. అలాగే రాజకీయ జీవితం మొత్తం పవన్ పైనే ఆధారపడుందనటంలో సందేహం లేదు. మరి మెగా కాంపౌండ్ లోనే సుమారు ఆరుగురు హీరోలున్నారు.

రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి చేతులు కాల్చుకున్నారు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేది కూడా లేదని ప్రకటించేశారు. చిరంజీవిని మినహాయిస్తే ఆయన కొడుకు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు మరో నలుగురు హీరోలున్నారు. సినిమాల్లోకి వీళ్ళ ఎంట్రీ అంతా చిరంజీవి వేసిన ప్లాట్ ఫారం మీదే అయినా కొద్దో గొప్పో అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ కు అభిమానుల ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. మరింతటి ఫాలోయింగ్ పెట్టుకున్న వాళ్ళలో ఎవరు కూడా పవన్ కు మద్దతుగా ఎందుకు నిలబడటం లేదనేది అర్ధం కావటం లేదు.

Satya

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

35 minutes ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

1 hour ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

2 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

3 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

3 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

4 hours ago