జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. పవన్ తల్లి పార్టీకి లక్ష రూపాయల విరాళమిచ్చారు. అలాగే మరో లక్షన్నర రూపాయలు ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు అందించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు పవన్ జిల్లాల పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆర్ధికంగా ఆదుకోవటం నిజంగా మంచిపనే.
ఈ మధ్యనే పవన్ సోదరుడు నాగబాబు పిల్లలు, సోదరి పిల్లలు నలుగురు కలిసి రు. 35 లక్షల విరాళాన్ని చెక్కుల రూపంలో అందించారు. వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునేందుకే ఖర్చు చేయాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళిస్తున్న కుటుంబ సభ్యులు రాజకీయంగా ఆదుకునేందుకు పవన్ కు ఎందుకు మద్దతివ్వడం లేదు ?
జనసేన పార్టీలో పవన్ కు మద్దతుగా కేవలం నాగుబాబు మాత్రమే యాక్టివ్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నాగబాబుకు చిరంజీవి సోదరుడిగానే తప్ప సొంతంగా అభిమానులు లేరు. అలాగే జనాల్లో పెద్దగా క్రేజు కూడా లేదు. నాగబాబు సినిమా కెరీర్ మొత్తం చిరంజీవి మీదే ఆధారపడుంది. అలాగే రాజకీయ జీవితం మొత్తం పవన్ పైనే ఆధారపడుందనటంలో సందేహం లేదు. మరి మెగా కాంపౌండ్ లోనే సుమారు ఆరుగురు హీరోలున్నారు.
రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి చేతులు కాల్చుకున్నారు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేది కూడా లేదని ప్రకటించేశారు. చిరంజీవిని మినహాయిస్తే ఆయన కొడుకు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు మరో నలుగురు హీరోలున్నారు. సినిమాల్లోకి వీళ్ళ ఎంట్రీ అంతా చిరంజీవి వేసిన ప్లాట్ ఫారం మీదే అయినా కొద్దో గొప్పో అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ కు అభిమానుల ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. మరింతటి ఫాలోయింగ్ పెట్టుకున్న వాళ్ళలో ఎవరు కూడా పవన్ కు మద్దతుగా ఎందుకు నిలబడటం లేదనేది అర్ధం కావటం లేదు.
This post was last modified on June 26, 2022 11:14 am
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…