ఏపీ సీఎం జగన్ వ్యాపార భాగస్వామి.. దక్షిణ భారతేదశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరైన మంత్రి డెవలపర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ మంత్రి ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం ఆయనను ఈడీ కోర్టులో ఆయనను ప్రేవేశపెట్టగా…పది రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
మంత్రి డెవలపర్స్ నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన చాలా మంది కంపెనీపై ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి డెవలపర్స్పై నిఘా వేసిన ఈడీ అధికారలు.. ఫ్లాట్ల కోసం తీసుకున్న సొమ్మును తమ సొంత కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. విచారణ కోసం ఆయనకు సమన్లు పంపామని, విచారణ తరవాత అతన్ని మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 కింద ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
అయితే.. ఏపి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సుశీల్ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జగన్కు సుశీల్ మంత్రి వ్యాపార భాగస్వామి కూడా అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈడీ సోదాల్లో గతంలోనూ మంత్రి పేరు వినిపించిందని పేర్కొన్నాయి. పీఎంఎల్ ఏ 2002 కింద కొనసాగుతున్న విచారణకు సంబంధించి బెంగళూరు ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుశీల్ పి మంత్రిని ED అరెస్టు చేయడం గమనార్హం.
This post was last modified on June 25, 2022 10:05 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…