Political News

బీఆర్ఎస్‌.. ప్ర‌క‌ట‌న వాయిదా.. వ్యూహం మార్చిన కేసీఆర్‌

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపే వ‌ర‌కు నిద్ర‌పోను అన్న‌ట్టుగా వ్యాఖ్య‌లు చేస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ క్ర‌మంలో తాను జాతీయ పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యార‌నే సంకేతాలు పంపించారు. దీనికి సంబంధించి ‘బీఆర్ ఎస్‌’ అంటే.. భార‌త‌ రాష్ట్ర స‌మితి పేరును కూడా ఆయ‌న ఖ‌రారు చేశార‌నివార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, ఈ నెల ఆఖ‌రులోనే ఆయ‌న ప్ర‌క‌ట‌న చేస్తార‌ని కూడా ప్ర‌గతి భ‌వ‌న్ వ‌ర్గాల నుంచి స‌మాచారం గుప్పుమంది.

అయితే.. ఇప్పుడు కేసీఆర్ వెన‌క్కిత‌గ్గార‌నే స‌మాచారం తెర‌మీదికి రావ‌డం ఆస‌క్తిగా మారింది. ఈ నెల ఆఖ‌రులోనే జాతీయ పార్టీపై ఒక ప్ర‌క‌ట‌న చేయాల‌ని అనుకున్నా.. జాతీయ స్థాయిలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న ప్ర‌క‌ట‌న‌ను కేసీఆర్ వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీ గురించి ఇటు రాష్ట్రం అటు దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

పార్టీ పెడతానని ప్రకటించినప్పటి నుంచే విభిన్న రకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే అనధికారికంగా.. పార్టీ పేరు సైతం ప్రచారంలోకి వచ్చేసింది. అయితే.. అధికారంగా పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. కొత్త జాతీయ పార్టీని రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది.

ఈ నెలలోనే పార్టీ ప్రారంభించాలని భావించినా.. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇది అనుకూల సమయం కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలకు మూడు వారాలకుపైగా గడువు ఉన్నం దున అప్పటి వరకు కొత్త పార్టీకి సంబంధించిన కసరత్తు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలే ప్రధానాంశంగా ఉన్నందున కొత్త జాతీయ పార్టీని తర్వాత ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తామని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో చర్చించి, మద్దతుపై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

కొత్త జాతీయ పార్టీ సన్నాహాల్లో భాగంగా కేసీఆర్‌ దేశంలోని ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విశ్రాం త ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక నిపుణుల బృందంతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. అదేవిధంగా జాతీయ మీడియా ప్రముఖులతో చర్చించారు. వచ్చేనెల రెండోవారం వరకు ఈ చర్చలు కొనసాగనున్నట్లు తెలిసింది. మొత్తానికి రాష్ట్ర‌ప‌తి ఎన్నికల‌ నేప‌థ్యంలో మారిన ప‌రిణామాల రీత్యా.. కేసీఆర్ త‌న నిర్ణ‌యాన్ని కూడా మార్చుకోవ‌డం.. గ‌మ‌నార్హం.

This post was last modified on June 25, 2022 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago