బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ గిరిజన నాయకురాలు, మాజీ గవర్నర్.. మాజీ మంత్రి.. ఒడిసాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆమె గెలుపు నల్లేరుపై నడకే అవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే.. ద్రౌపది ఎంపికపై వివాదాలకు కేరాఫ్గా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చేసిన ట్వీట్ .. రాజకీయ కాక రేపింది. “రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది. అయితే.. పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు?” అని వర్మ సంచలన ట్వీట్ చేశారు.
దీనిపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఏపీ, తెలంగాణలోని బీజేపీ నాయకులు వర్మపై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ట్వీట్ను సుమోటొగా తీసుకుని పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వర్మలాగా ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ముందు వర్మని జైలుకి పంపాలన్నారు. అలాగే వర్మను మానసిక వైద్యుడి చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా తెలంగాణలోని ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ఆర్జీవీని వేస్ట్ ఫెలో’ అన్నారు. రాంగోపాల్ వర్మ మందు తాగి ట్వీట్స్ చేస్తారని ఫైర్ అయ్యారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటారని, ద్రౌపది ముర్ముపై వర్మ ట్వీట్ను ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
కేసు.. నమోదు..
వర్మ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు రాంగోపాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీని వేస్ట్ ఫెలోతో పోల్చారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమన్నారు. కాగా.. వర్మ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కించపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. అయినా.. రాజకీయంగా మాత్రం వర్మ రేపిన వివాదం ఎక్కడా ఆగకపోవడం గమనార్హం.
This post was last modified on June 24, 2022 7:55 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…