పరిపాలనలో అధికార యంత్రాంగాన్ని నడిపించటంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు ఎలాగుందో తెలీదు. అయితే ఇంటెలిజెన్స్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవటంలో మాత్రం అట్టర్ ఫెయిలైనట్లు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యమంత్రిగానే కాదు పార్టీ అధినేతగా కూడా విఫలమయ్యారు. ఇంటెలిజెన్స్ శాఖ యావత్తు ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంటుంది.
అలాగే పార్టీ అధినేతగా పార్టీలో ఏమి జరుగుతోందో వెంటనే తెలుసుకునే యంత్రాంగం కూడా ఉద్థవ్ చేతిలోనే ఉంటుంది. అలాంటిది ఇటు సీఎంగా అటు పార్టీ అధినేతగా ఉండి కూడా పార్టీలో తిరుగుబాటు మొదలవ్వబోతోందని, ఆ తిరుగుబాటు తన సీటుకే ఎసరు తెస్తుందని చివరి నిముషం వరకు సీఎంకు తెలీకపోయిందంటే ఆయన నూరుశాతం ఫెయిలయ్యారని కాక మరేవిధంగా చూడాలి. ఇక్కడ థాక్రే ఫెయిల్యూర్లు రెండు విధాలుగా ఉన్నాయి.
మొదటిదేమో ఎంఎల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఒకరు ఓడిపోవటం. సంఖ్యా బలం రీత్యా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి తరపున ఆరుగురు గెలవాల్సుండగా ఐదుగురే గెలిచారు. ఇక్కడే థాక్రే మేల్కొనుండాల్సింది. తమ కూటమి తరపున పోటీ చేసిన వారిలో ఒకళ్ళు ఓడిపోవటమే కాకుండా ప్రత్యర్ధి బీజేపీ తరపున అదనంగా ఒకళ్ళు గెలిచారు. ఇక్కడే థాక్రే ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని గ్రహించుండాలి. అలా గ్రహించలేకపోవటం కచ్చితంగా సీఎం ఫెయిల్యూర్ అనే చెప్పాలి.
కూటమిలోని ఒకళ్ళు ఓడిపోయిన వెంటనే తమ ఎంఎల్ఏలందరినీ పిలిచి సమావేశం పెట్టుంటే విషయం బయటపడుండేది. అయితే థాక్రే ఎంఎల్ఏలతో మీటింగ్ పెట్టలేదు. కూటమిలోని ఎన్సీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏల ఓట్లన్నీ వాళ్ళకే పడ్డాయి. శివసేన ఎంఎల్ఏల ఓట్లే క్రాస్ అయ్యాయి. ఈ విషయం తెలిసీ థాక్రే ఉదాసీనంగా వ్యవహరించారు. ఇక్కడే ఇంటెలిజెన్స్, పార్టీ ఇంటెలిజెన్స్ రెండూ ఫెయిలయ్యాయని అర్ధమైపోతోంది. మంత్రులను, ఎంఎల్ఏలను సరిగా కలవకపోవటం, వారితో మంచి సంబంధాలు మైన్ టైన్ చేయకపోవటం కూడా థాక్రే తప్పే. ఇదే విషయాన్ని రెబల్ ఎంఎల్ఏ స్పష్టంగా థాక్రేకి రాసిన లేఖలో చెప్పారు. ఏదేమైనా సీఎంగా థాక్రే ఫెయిలయ్యారన్నది వాస్తవం.
This post was last modified on June 24, 2022 12:23 pm
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…
ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…
నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…
టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…