వివిధ రంగాల్లో తారాపథంలో దూసుకుపోతున్న కారణంగా తమకు దిష్టి తగులుతుందని అనుకున్నారో ఏమోగానీ సడెన్ గా సమాజసేవలోకి దిగేసింది అదానీ ఫౌండేషన్. విద్య, వైద్యం, నైపుణ్య రంగాల్లో రు. 60 వేల కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ చేసినట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. 60 వేల కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఏపీ బడ్జెట్ లో దాదాపు సగానికన్నా పెద్ద మొత్తంమనే చెప్పాలి.
ఇన్ని వేల కోట్ల రూపాయలను సమాజ సేవకు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎందుకొచ్చిందో తెలీటం లేదు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఒక్కసారిగా అదానీ పేరు దేశంలో మారుమోగిపోవటం మొదలైంది. యావత్ దేశం చూస్తుండగానే అదానీ గ్రూపు వ్యాపార విలువ లక్షల కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోయింది. దాంతో గ్రూపు ఎంతగా పాపులరైందో అంతే స్ధాయిలో నెగిటివ్ ప్రచారం కూడా పెరిగిపోతోంది. పైగా మోడీకి అదానికి లింకు పెడుతూ జరిగే ప్రచారం బాగా పెరిగిపోయింది. తాజా నిర్ణయంతో అది సమసిపోతుందని అదానీ యాజమాన్యం భావించిందేమో మరి.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నారో ఏమో మొత్తానికి వేల కోట్ల రూపాయలను సమాజసేవలో ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇఫ్పటికే అదానీ గ్రూపు బొగ్గు, మైనింగ్, లాజిస్టిక్స్, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణి, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంటు, షిప్పింగ్ రంగాల్లో బాగా చొచ్చుకుపోయింది. తమ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఖర్చు చేయనున్నట్లు గ్రూపు తెలిపింది.
నిజానికి ప్రతి కార్పొరేట్ కంపెనీ తమ ఆదాయంలో ప్రతి ఏడాది 2 శాతాన్ని సీఎస్ఆర్ రూపంలో సమాజానికి ఖర్చు చేయాలి. సీఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి రూపంలో విద్య, వైద్యం తదితర రంగాల్లో కచ్చితంగా ఖర్చుచేయాలి. మరి అదాని గ్రూపు ఈ రూపంలో ఇప్పటివరకు ఎంత ఖర్చుచేసిందో ఎవరికీ తెలీదు. సరే ఇప్పటివరకు ఖర్చు చేసిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పటినుంచైనా సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలన్న ఆలోచన రావటం సంతోషించాల్సిందే.
This post was last modified on June 24, 2022 12:19 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…