వివిధ రంగాల్లో తారాపథంలో దూసుకుపోతున్న కారణంగా తమకు దిష్టి తగులుతుందని అనుకున్నారో ఏమోగానీ సడెన్ గా సమాజసేవలోకి దిగేసింది అదానీ ఫౌండేషన్. విద్య, వైద్యం, నైపుణ్య రంగాల్లో రు. 60 వేల కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ చేసినట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. 60 వేల కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఏపీ బడ్జెట్ లో దాదాపు సగానికన్నా పెద్ద మొత్తంమనే చెప్పాలి.
ఇన్ని వేల కోట్ల రూపాయలను సమాజ సేవకు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎందుకొచ్చిందో తెలీటం లేదు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఒక్కసారిగా అదానీ పేరు దేశంలో మారుమోగిపోవటం మొదలైంది. యావత్ దేశం చూస్తుండగానే అదానీ గ్రూపు వ్యాపార విలువ లక్షల కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోయింది. దాంతో గ్రూపు ఎంతగా పాపులరైందో అంతే స్ధాయిలో నెగిటివ్ ప్రచారం కూడా పెరిగిపోతోంది. పైగా మోడీకి అదానికి లింకు పెడుతూ జరిగే ప్రచారం బాగా పెరిగిపోయింది. తాజా నిర్ణయంతో అది సమసిపోతుందని అదానీ యాజమాన్యం భావించిందేమో మరి.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నారో ఏమో మొత్తానికి వేల కోట్ల రూపాయలను సమాజసేవలో ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇఫ్పటికే అదానీ గ్రూపు బొగ్గు, మైనింగ్, లాజిస్టిక్స్, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణి, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంటు, షిప్పింగ్ రంగాల్లో బాగా చొచ్చుకుపోయింది. తమ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఖర్చు చేయనున్నట్లు గ్రూపు తెలిపింది.
నిజానికి ప్రతి కార్పొరేట్ కంపెనీ తమ ఆదాయంలో ప్రతి ఏడాది 2 శాతాన్ని సీఎస్ఆర్ రూపంలో సమాజానికి ఖర్చు చేయాలి. సీఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి రూపంలో విద్య, వైద్యం తదితర రంగాల్లో కచ్చితంగా ఖర్చుచేయాలి. మరి అదాని గ్రూపు ఈ రూపంలో ఇప్పటివరకు ఎంత ఖర్చుచేసిందో ఎవరికీ తెలీదు. సరే ఇప్పటివరకు ఖర్చు చేసిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పటినుంచైనా సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలన్న ఆలోచన రావటం సంతోషించాల్సిందే.
This post was last modified on June 24, 2022 12:19 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…