తెలంగాణాలో ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలకన్నా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చాలా బెటరని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యల పై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కాంత్ జైశ్వాల్ ను కలిసి వ్రాత మూలకంగా ఫిర్యాదుచేశారు. కేసీయార్, ఆయన కుటుంబసభ్యులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రు. 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు.
తన ఆరోపణలకు ఇవే ఆధారాలంటు కొన్ని డాక్యుమెంట్లను కూడా అందించారు. పాల్ చేసిన ఆరోపణలు నిజామా కాదా, ఆయన అందించిన డాక్యుమెంట్లలో వాస్తవం ఎంత ? అన్న విషయాలను పక్కన పెట్టేద్దాం. ఇలాంటి ఆరోపణలనే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలాకాలంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే కేసీయార్ అవినీతిపై విచారణ జరిపించి వెంటనే జైలుకు పంపిస్తామంటు వందల సార్లు చెప్పుంటారు.
కాంగ్రెస్ పార్టీ ఇలా ఆరోపణలతో కాలం గడుపుతోందంటే అర్ధముంది. మరి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ నేతలు కేవలం ఆరోపణలతోనే కాలం ఎందుకు వెళ్ళదీస్తున్నట్లు ? నిజంగానే వాళ్ళదగ్గర కేసీయార్+ఆయన కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడుంటే, అందుకు ఆధారాలుండటమే నిజమైతే ఎందుకని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయలేదు. తమ దగ్గరున్న ఆధారాలన్నింటిని కేంద్రానికి అందించి సీబీఐ విచారణ మొదలుపెట్టించవచ్చు కదా.
విచారణలో ఆరోపణలన్నీ నిర్ధారణ అయితే వెంటనే అందరి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించే అవకాశం బీజేపీ నేతలకు పుష్కలంగా ఉంది. అలాంటి అవకాశాలుండీ కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతున్నారంటే అర్ధమేంటి ? కాంగ్రెస్, బీజేపీ నేతల వైఖరితో పోల్చుకుంటే కేఏ పాల్ గట్టోరనే అనుకోవాలి కదా. అవినీతికి పాల్పడుతున్నారని, ఆధారాలున్నాయని చెప్పి సీబీఐ డైరెక్టర్ ను కలిసి కొన్ని డాక్యుమెంట్లను కూడా అందించారు. విచారణ జరిగితే ఆరోపణలు, డాక్యుమెంట్లలో నిజాలెంత అనేది తేలుతుంది.
This post was last modified on June 23, 2022 11:26 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…