తెలంగాణాలో ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలకన్నా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చాలా బెటరని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యల పై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కాంత్ జైశ్వాల్ ను కలిసి వ్రాత మూలకంగా ఫిర్యాదుచేశారు. కేసీయార్, ఆయన కుటుంబసభ్యులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రు. 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు.
తన ఆరోపణలకు ఇవే ఆధారాలంటు కొన్ని డాక్యుమెంట్లను కూడా అందించారు. పాల్ చేసిన ఆరోపణలు నిజామా కాదా, ఆయన అందించిన డాక్యుమెంట్లలో వాస్తవం ఎంత ? అన్న విషయాలను పక్కన పెట్టేద్దాం. ఇలాంటి ఆరోపణలనే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలాకాలంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే కేసీయార్ అవినీతిపై విచారణ జరిపించి వెంటనే జైలుకు పంపిస్తామంటు వందల సార్లు చెప్పుంటారు.
కాంగ్రెస్ పార్టీ ఇలా ఆరోపణలతో కాలం గడుపుతోందంటే అర్ధముంది. మరి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ నేతలు కేవలం ఆరోపణలతోనే కాలం ఎందుకు వెళ్ళదీస్తున్నట్లు ? నిజంగానే వాళ్ళదగ్గర కేసీయార్+ఆయన కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడుంటే, అందుకు ఆధారాలుండటమే నిజమైతే ఎందుకని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయలేదు. తమ దగ్గరున్న ఆధారాలన్నింటిని కేంద్రానికి అందించి సీబీఐ విచారణ మొదలుపెట్టించవచ్చు కదా.
విచారణలో ఆరోపణలన్నీ నిర్ధారణ అయితే వెంటనే అందరి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించే అవకాశం బీజేపీ నేతలకు పుష్కలంగా ఉంది. అలాంటి అవకాశాలుండీ కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతున్నారంటే అర్ధమేంటి ? కాంగ్రెస్, బీజేపీ నేతల వైఖరితో పోల్చుకుంటే కేఏ పాల్ గట్టోరనే అనుకోవాలి కదా. అవినీతికి పాల్పడుతున్నారని, ఆధారాలున్నాయని చెప్పి సీబీఐ డైరెక్టర్ ను కలిసి కొన్ని డాక్యుమెంట్లను కూడా అందించారు. విచారణ జరిగితే ఆరోపణలు, డాక్యుమెంట్లలో నిజాలెంత అనేది తేలుతుంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…