దేశంలో ప్రతిపక్షాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కాబట్టే నరేంద్ర మోడీ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్లమెంటులో కానీ బయట కానీ ప్రభుత్వాన్ని నిలదీసేంత దమ్మున్న పార్టీలు లేవని మోడీకి బాగా అర్ధమైపోయింది. పోనీ కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతాయా అంటే ఆ భయం కూడా ప్రధానమంత్రికి లేదు. ఎందుకంటే ప్రతిపక్షాల పరిస్ధితి అలాగుంది మరి.
ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్ధినే ఎంపిక చేసుకోలేకపోతున్న ఈ ప్రతిపక్షాలు ఇక నరేంద్ర మోడీకి ధీటుగా ప్రధానమంత్రి అభ్యర్థిని నిలబెడతాయా ? ఎన్డీయే ప్రతిపాదించబోయే రాష్ట్రపతి అభ్యర్ధికి పోటీగా ఉమ్మడిగా నాన్ ఎన్డీయే పార్టీల తరపున ఒక అభ్యర్ధిని రంగంలోకి దించాలని డిసైడ్ చేశాయి. ఇందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం తీసుకున్నారు. ముందుగా శరద్ పవార్ అనుకున్నారు. అయితే పవార్ ఇష్టపడలేదు.
తర్వాత ఫరూక్ అబ్దుల్లాను అనుకున్నా ఉపయోగం లేకపోయింది. దేవేగౌడను ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తాజాగా గోపాలకృష్ణ గాంధీ కూడా రేసులో నుండి వెనక్కు తగ్గినట్లు ప్రకటించి నాన్ ఎన్డీయే పార్టీలకు పెద్ద షాకిచ్చారు. ఎన్డీయే అభ్యర్ధికి ధీటుగా పోటీచేసినా ఉపయోగం ఉండదనే అనుమానం+ 80 ఏళ్ళుదాటినా ఇంకా క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని కోరుకుంటున్న కారణంగానే పై నేతల్లో ముగ్గురు పోటీ నుండి తప్పుకున్నట్లున్నారు.
22 ప్రతిపక్షాలు కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని ఎంపిక చేయలేకపోవడం కన్నా దారుణం మరొకటుంటుందా. ఇంత పెద్ద దేశంలో ఇన్ని ప్రతిపక్షాల్లో ఒక్క అభ్యర్ధి కూడా దొరకలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి మన దగ్గర రాష్ట్రపతి పదవంటేనే రబ్బర్ స్టాంప్ లాంటిదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇలాంటి పోస్టుకు పోటీచేయడానికి అభ్యర్ధికి దొరక్కపోతే రేపు ప్రధానమంత్రి పదవికి సరైన అభ్యర్ధిని ఎలా ఎంపిక చేయగలుగుతాయి ప్రతిపక్షాలు. బహుశా ప్రధానమంత్రి పదవికి పోటీ అంటే పవార్, దేవేగౌడ లాంటి వాళ్ళు పరుగెత్తుకుంటు వస్తారేమో. కానీ అందరు వీళ్ళని ఆమోదించవద్దా ? ఓట్లేసి గెలిపించవద్దా ?
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…