జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కన్ఫ్యూజ్ మాస్టరా? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజులు పొత్తులు అంటారు.. మరికొన్ని రోజులు వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా తానే నడుం బిగిస్తానని.. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తానని.. ఆయన ప్రకటించారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని కూడా చెప్పారు. అంతేకాదు.. తనతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు ముందుకు వచ్చినా.. తాను సిద్ధమేనని ప్రకటించారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మహాకూటమి రెడీ అవుతుందని.. వైసీపీ వ్యతిరక పవనాలను ఈ పార్టీలు ఒడిసిపట్టుకుని.. జగన్ను ఇంటికి పంపిస్తాయని.. అందరూ అంచనా వేసుకున్నారు. ముఖ్యంగా.. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని.. ఇదే జరిగితే..వైసీపీ ఓడిపోవడం ఖాయమని అందరూ లెక్కలు వేసుకున్నారు. కట్ చేస్తే.. తాజాగా జనసేనాని ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తనే ఒంటరిగా బరిలోకి దిగుతానని.. చెప్పకనే చెప్పారు.
పొత్తులపై ఇప్పుడు కామెంట్లు చేయబోనని అన్నారు. గతంలో మాత్రం పొత్తులు ఉంటాయని.. చెప్పారు. పొత్తులపై మీరు నాకు పాఠాలు చెబుతారా? అంటూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు. అలాంటి నాయకుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. పోనీ.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులు లేకుండానే తాము బరిలో నిలుస్తామని కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పార్టీ కేడర్లో తీవ్రమైన అయోమయం నెలకొంది. అసలు ఏం జరుగుతోంది? తాము ఎటు వెళ్లాలి.. ఎలా వ్యవహరించాలి? అనే చర్చ సాగుతోంది.
ఇదే విషయంపై నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఒకవిధమైన పాలిటిక్స్ చేసిన పవన్ ఇప్పుడు కన్ఫ్యూజ్ మాస్టర్గా మారిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే.. ఇప్పటి నుంచి నియోజకవర్గాల పంపకం.. అసంతృప్తుల తగ్గింపు.. ఇలా అనేక విషయాలపై ఒక క్లారిటీ ఉంటుందని.. నాయకుల్లోనూ నైతికంగా బలం పెరుగుతుందని.. అయితే.. ఇలా పొంతనలేని వ్యాఖ్యలు చేయడం ద్వారా..పవన్ ఏం చేస్తున్నారనేది నెటిజన్ల ప్రశ్న. దీనివల్లపార్టీలో కార్యకర్తలు, నాయకులుకూడా డీలా పడడం ఖాయమని.. ఇది పార్టీకి మున్ముందు ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 21, 2022 11:32 am
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…