జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కన్ఫ్యూజ్ మాస్టరా? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజులు పొత్తులు అంటారు.. మరికొన్ని రోజులు వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా తానే నడుం బిగిస్తానని.. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తానని.. ఆయన ప్రకటించారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని కూడా చెప్పారు. అంతేకాదు.. తనతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు ముందుకు వచ్చినా.. తాను సిద్ధమేనని ప్రకటించారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మహాకూటమి రెడీ అవుతుందని.. వైసీపీ వ్యతిరక పవనాలను ఈ పార్టీలు ఒడిసిపట్టుకుని.. జగన్ను ఇంటికి పంపిస్తాయని.. అందరూ అంచనా వేసుకున్నారు. ముఖ్యంగా.. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని.. ఇదే జరిగితే..వైసీపీ ఓడిపోవడం ఖాయమని అందరూ లెక్కలు వేసుకున్నారు. కట్ చేస్తే.. తాజాగా జనసేనాని ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తనే ఒంటరిగా బరిలోకి దిగుతానని.. చెప్పకనే చెప్పారు.
పొత్తులపై ఇప్పుడు కామెంట్లు చేయబోనని అన్నారు. గతంలో మాత్రం పొత్తులు ఉంటాయని.. చెప్పారు. పొత్తులపై మీరు నాకు పాఠాలు చెబుతారా? అంటూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు. అలాంటి నాయకుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. పోనీ.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులు లేకుండానే తాము బరిలో నిలుస్తామని కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పార్టీ కేడర్లో తీవ్రమైన అయోమయం నెలకొంది. అసలు ఏం జరుగుతోంది? తాము ఎటు వెళ్లాలి.. ఎలా వ్యవహరించాలి? అనే చర్చ సాగుతోంది.
ఇదే విషయంపై నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఒకవిధమైన పాలిటిక్స్ చేసిన పవన్ ఇప్పుడు కన్ఫ్యూజ్ మాస్టర్గా మారిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే.. ఇప్పటి నుంచి నియోజకవర్గాల పంపకం.. అసంతృప్తుల తగ్గింపు.. ఇలా అనేక విషయాలపై ఒక క్లారిటీ ఉంటుందని.. నాయకుల్లోనూ నైతికంగా బలం పెరుగుతుందని.. అయితే.. ఇలా పొంతనలేని వ్యాఖ్యలు చేయడం ద్వారా..పవన్ ఏం చేస్తున్నారనేది నెటిజన్ల ప్రశ్న. దీనివల్లపార్టీలో కార్యకర్తలు, నాయకులుకూడా డీలా పడడం ఖాయమని.. ఇది పార్టీకి మున్ముందు ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 21, 2022 11:32 am
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…