Political News

బాబు న‌డిస్తే చాల‌దు… నేత‌ల‌ను న‌డిపించాలిగా…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌య‌సు 70+ కానీ, ఆయ‌న మాత్రం 20+ మాదిరిగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. వైసీపీ నేత‌లకు స‌వాళ్లు రువ్వుతున్నారు. గ‌తంలో కూడా లేని ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇది మంచి ప‌రిణామ‌మే. చంద్ర‌బాబుపై ఉన్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేదే. అయితే.. చంద్ర‌బాబు ఒక‌వైపే చూస్తున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. తాను మాత్ర‌మే న‌డిస్తే.. పార్టీలో జోష్ పెర‌గ‌ద‌ని అంటున్నారు. త‌ను ఎంచుకున్న ల‌క్ష్యాన్ని మ‌రింత బ‌లంగా ముందు నాయ‌కుల్లో తీసుకురావాల‌ని అంటున్నారు.

“2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. చంద్ర‌బాబు వ‌న్ మ్యాన్ షో చేశారు. అప్ప‌ట్లోనూ..త‌నే అన్నీ అయి ప్ర‌చారం చేశారు. నిజానికి చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏమీలేదు. ఆయ‌న ప‌ట్ల ఇప్ప‌టికీ .. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. ఆయ‌న‌కు అధికారం ఇవ్వాల‌నే అనుకుంటున్నారు. కానీ, ఎటొచ్చీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితిపైనే చ‌ర్చ సాగుతోంది. వైసీపీ మాదిరిగా.. టీడీపీ వ్య‌క్తిగ‌త రాజ‌కీయాలు చేసేందుకు అవ‌కాశం లేదు” అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ రాజ‌కీయం వ్య‌క్తిని బ‌ట్టి న‌డిచింది. కేవ‌లం జ‌గ‌న్‌ను చూసి ప్ర‌జ‌లు ఓట్లేశారు. ఆయ‌న‌ను న‌మ్మారు. నాయకులు ఎవ‌రు బ‌రిలో ఉన్నార‌నేది చూడ‌కుండానే.. జ‌గ‌న్‌ను చూసి ఓటేశారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. జగ‌నే స్వ‌యంగా.. మీరు బ‌ల‌పడండి.. మీరే పార్టీని గెలిపించాలి.. అని నాయ‌కుల‌కు చెబుతున్నారు. అంటే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు బలం పుంజుకోవాల‌నేది జ‌గ‌న్ చెబుతున్న మాట‌. ఇదే విష‌యాన్ని టీడీపీలో చెప్పాల‌నేది విశ్లేష‌కుల మాట‌.

చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయ‌మే ఉంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయ్యే నాయ‌కులు కావాల‌ని.. గ‌త ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. ఒక‌టి రెండు త‌ప్ప‌.. 23 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయిన నాయ‌కులకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని అంటున్నారు. ఇదే త‌ర‌హా వ్యూహాలు అనుస‌రించాలి .. త‌ప్ప‌.. కేవ‌లం త‌ను ప్ర‌చారం చేసుకుని వెళ్లిపోయి.. ఓట్లు వేయాల‌ని అంటే.. సాధ్య‌మేనా? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అంటే.. చంద్ర‌బాబు ఒక్క‌రే కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బ‌ల‌మైన నాయ‌కుల‌ను త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

This post was last modified on June 21, 2022 11:31 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

58 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago