టీడీపీ అధినేత చంద్రబాబు వయసు 70+ కానీ, ఆయన మాత్రం 20+ మాదిరిగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు సవాళ్లు రువ్వుతున్నారు. గతంలో కూడా లేని ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇది మంచి పరిణామమే. చంద్రబాబుపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టేదే. అయితే.. చంద్రబాబు ఒకవైపే చూస్తున్నారనేది విశ్లేషకుల మాట. తాను మాత్రమే నడిస్తే.. పార్టీలో జోష్ పెరగదని అంటున్నారు. తను ఎంచుకున్న లక్ష్యాన్ని మరింత బలంగా ముందు నాయకుల్లో తీసుకురావాలని అంటున్నారు.
“2019 ఎన్నికల సమయంలోనూ.. చంద్రబాబు వన్ మ్యాన్ షో చేశారు. అప్పట్లోనూ..తనే అన్నీ అయి ప్రచారం చేశారు. నిజానికి చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఏమీలేదు. ఆయన పట్ల ఇప్పటికీ .. విజన్ ఉన్న నాయకుడిగా ప్రజల్లో మంచి పేరుంది. ఆయనకు అధికారం ఇవ్వాలనే అనుకుంటున్నారు. కానీ, ఎటొచ్చీ.. క్షేత్రస్థాయిలో నాయకుల పరిస్థితిపైనే చర్చ సాగుతోంది. వైసీపీ మాదిరిగా.. టీడీపీ వ్యక్తిగత రాజకీయాలు చేసేందుకు అవకాశం లేదు” అని విశ్లేషకులు చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ రాజకీయం వ్యక్తిని బట్టి నడిచింది. కేవలం జగన్ను చూసి ప్రజలు ఓట్లేశారు. ఆయనను నమ్మారు. నాయకులు ఎవరు బరిలో ఉన్నారనేది చూడకుండానే.. జగన్ను చూసి ఓటేశారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జగనే స్వయంగా.. మీరు బలపడండి.. మీరే పార్టీని గెలిపించాలి.. అని నాయకులకు చెబుతున్నారు. అంటే.. క్షేత్రస్థాయిలో నాయకులు బలం పుంజుకోవాలనేది జగన్ చెబుతున్న మాట. ఇదే విషయాన్ని టీడీపీలో చెప్పాలనేది విశ్లేషకుల మాట.
చంద్రబాబుపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అయితే.. క్షేత్రస్థాయిలో ప్రజలతో కనెక్ట్ అయ్యే నాయకులు కావాలని.. గత ఎన్నికలను తీసుకుంటే.. ఒకటి రెండు తప్ప.. 23 నియోజకవర్గాల్లోనూ.. ప్రజలతో కనెక్ట్ అయిన నాయకులకే ప్రజలు పట్టం కట్టారని అంటున్నారు. ఇదే తరహా వ్యూహాలు అనుసరించాలి .. తప్ప.. కేవలం తను ప్రచారం చేసుకుని వెళ్లిపోయి.. ఓట్లు వేయాలని అంటే.. సాధ్యమేనా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే.. చంద్రబాబు ఒక్కరే కాకుండా.. నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…