ఎండ, వాన పట్టకుండా ఉంటున్నారు. అబ్బా! ఇంటికి పొండి మీకు సెలవులు ఇచ్చేస్తాం అని కేసీఆర్ అంటూ ఉంటే పట్టించుకోకుండా అక్కడే ఉండిపోతున్నారు ఆ బిడ్డలు. నిరసనకు ఓ కొత్త నిర్వచనం చెబుతున్న ఈ బిడ్డలు తాము అనుకున్నవి సాధించే వరకూ తరగతి గదుల్లోకి తొంగి చూడం అని అంటున్నారు. ఇది కదా ! కావాలి..బాసర విద్యార్థులు (ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అని రాయాలి) దేశానికే ఒక కొత్త మార్గం చూపుతున్నారు. ఆందోళనల్లో కొత్త అధ్యాయం ఇది. అస్సలు ఎవ్వరూ మాట్లాడరు.. ఎవ్వరూ అదే పనిగా అరవరు.. తామేం చెప్పాలనుకుంటున్నామో అవి మాత్రమే ఇప్పటికే చెప్పి ఊరుకున్నారు.
సబితమ్మ (విద్యాశాఖ మంత్రి) ఇవన్నీ సిల్లీ డిమాండ్లు అన్నా నవ్వి ఊరుకున్నారే కానీ నోరేసుకుని పడిపోలేదు. మంచి విద్యను కోరుకోవడం మా బిడ్డల హక్కు అని తల్లిదండ్రులు అంతా గొంతెత్తుతున్నారు. ఇది చూసి మొన్నటి అగ్నిపథ్ ఆందోళనకారులు నేర్చుకోవాలి. కవిత్వం రాస్తూ, పాటలు పాడుతూ తమ ఆందోళనలకు మరో సృజన రూపం ఇస్తూ ట్విటర్ వేదికగా తమ గోడు చెప్పుకుంటున్నారే కానీ ఎక్కడా సర్కారును ఆడిపోసుకోవడం లేదు. నిరసనలు చూసి దేశం నివ్వెర పోతోంది అని అంటే అది నిజంగానే వారి గొప్పతనం. అదే వారి సంయమనానికి ప్రతీక.
12 డిమాండ్లు.. మాకో వీసీ కావాలి. పార్ట్ టైం కాదు ఫుల్ టైం..మాకు కనీస వసతులు కావాలి.. అలానే ల్యాప్ ట్యాప్ లు కావాలి.. మేం చదువుకుంటా ఫుల్ టైం మాతో పాటే ఉంటే అధ్యాపకులు కావాలి..వీటితోపాటు కనీస అవసరాలు తీర్చండి చాలు..మంచి భోజనం పెట్టండి చాలు..అని అడుగుతున్నారు.. ఆరో రోజు అత్యంత శాంతియుత పంథాలో వీరంతా నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా తాము కదలబోం అని చెబుతున్నారు.
ఈ బిడ్డలున్న చోట పోలీసులు ఉన్నా వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. అదనపు బలగాలు వచ్చినా చేసేందుకు ఏమీలేక మిన్నకుండిపోతున్నాయి. ఈ దేశంలో హక్కులను సాధించుకునే పద్ధతి ఇది అని రాకేశ్ టికాయత్ లాంటి ఆందోళనకారులకు సైతం పాఠాలు చెబుతున్నారు వీరు.. ఇది కదా ! కావాలి. అందుకే పిల్లలూ మీకు జేజేలు అని పదే పదే తల్లిదండ్రులతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా అంటున్నారు. ఇప్పుడు పట్టించుకోవాల్సింది.. పరిష్కరించాల్సింది కేసీఆర్ సర్ మాత్రమే!
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…