ఎండ, వాన పట్టకుండా ఉంటున్నారు. అబ్బా! ఇంటికి పొండి మీకు సెలవులు ఇచ్చేస్తాం అని కేసీఆర్ అంటూ ఉంటే పట్టించుకోకుండా అక్కడే ఉండిపోతున్నారు ఆ బిడ్డలు. నిరసనకు ఓ కొత్త నిర్వచనం చెబుతున్న ఈ బిడ్డలు తాము అనుకున్నవి సాధించే వరకూ తరగతి గదుల్లోకి తొంగి చూడం అని అంటున్నారు. ఇది కదా ! కావాలి..బాసర విద్యార్థులు (ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అని రాయాలి) దేశానికే ఒక కొత్త మార్గం చూపుతున్నారు. ఆందోళనల్లో కొత్త అధ్యాయం ఇది. అస్సలు ఎవ్వరూ మాట్లాడరు.. ఎవ్వరూ అదే పనిగా అరవరు.. తామేం చెప్పాలనుకుంటున్నామో అవి మాత్రమే ఇప్పటికే చెప్పి ఊరుకున్నారు.
సబితమ్మ (విద్యాశాఖ మంత్రి) ఇవన్నీ సిల్లీ డిమాండ్లు అన్నా నవ్వి ఊరుకున్నారే కానీ నోరేసుకుని పడిపోలేదు. మంచి విద్యను కోరుకోవడం మా బిడ్డల హక్కు అని తల్లిదండ్రులు అంతా గొంతెత్తుతున్నారు. ఇది చూసి మొన్నటి అగ్నిపథ్ ఆందోళనకారులు నేర్చుకోవాలి. కవిత్వం రాస్తూ, పాటలు పాడుతూ తమ ఆందోళనలకు మరో సృజన రూపం ఇస్తూ ట్విటర్ వేదికగా తమ గోడు చెప్పుకుంటున్నారే కానీ ఎక్కడా సర్కారును ఆడిపోసుకోవడం లేదు. నిరసనలు చూసి దేశం నివ్వెర పోతోంది అని అంటే అది నిజంగానే వారి గొప్పతనం. అదే వారి సంయమనానికి ప్రతీక.
12 డిమాండ్లు.. మాకో వీసీ కావాలి. పార్ట్ టైం కాదు ఫుల్ టైం..మాకు కనీస వసతులు కావాలి.. అలానే ల్యాప్ ట్యాప్ లు కావాలి.. మేం చదువుకుంటా ఫుల్ టైం మాతో పాటే ఉంటే అధ్యాపకులు కావాలి..వీటితోపాటు కనీస అవసరాలు తీర్చండి చాలు..మంచి భోజనం పెట్టండి చాలు..అని అడుగుతున్నారు.. ఆరో రోజు అత్యంత శాంతియుత పంథాలో వీరంతా నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా తాము కదలబోం అని చెబుతున్నారు.
ఈ బిడ్డలున్న చోట పోలీసులు ఉన్నా వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. అదనపు బలగాలు వచ్చినా చేసేందుకు ఏమీలేక మిన్నకుండిపోతున్నాయి. ఈ దేశంలో హక్కులను సాధించుకునే పద్ధతి ఇది అని రాకేశ్ టికాయత్ లాంటి ఆందోళనకారులకు సైతం పాఠాలు చెబుతున్నారు వీరు.. ఇది కదా ! కావాలి. అందుకే పిల్లలూ మీకు జేజేలు అని పదే పదే తల్లిదండ్రులతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా అంటున్నారు. ఇప్పుడు పట్టించుకోవాల్సింది.. పరిష్కరించాల్సింది కేసీఆర్ సర్ మాత్రమే!
This post was last modified on June 20, 2022 12:49 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…