ఎండ, వాన పట్టకుండా ఉంటున్నారు. అబ్బా! ఇంటికి పొండి మీకు సెలవులు ఇచ్చేస్తాం అని కేసీఆర్ అంటూ ఉంటే పట్టించుకోకుండా అక్కడే ఉండిపోతున్నారు ఆ బిడ్డలు. నిరసనకు ఓ కొత్త నిర్వచనం చెబుతున్న ఈ బిడ్డలు తాము అనుకున్నవి సాధించే వరకూ తరగతి గదుల్లోకి తొంగి చూడం అని అంటున్నారు. ఇది కదా ! కావాలి..బాసర విద్యార్థులు (ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అని రాయాలి) దేశానికే ఒక కొత్త మార్గం చూపుతున్నారు. ఆందోళనల్లో కొత్త అధ్యాయం ఇది. అస్సలు ఎవ్వరూ మాట్లాడరు.. ఎవ్వరూ అదే పనిగా అరవరు.. తామేం చెప్పాలనుకుంటున్నామో అవి మాత్రమే ఇప్పటికే చెప్పి ఊరుకున్నారు.
సబితమ్మ (విద్యాశాఖ మంత్రి) ఇవన్నీ సిల్లీ డిమాండ్లు అన్నా నవ్వి ఊరుకున్నారే కానీ నోరేసుకుని పడిపోలేదు. మంచి విద్యను కోరుకోవడం మా బిడ్డల హక్కు అని తల్లిదండ్రులు అంతా గొంతెత్తుతున్నారు. ఇది చూసి మొన్నటి అగ్నిపథ్ ఆందోళనకారులు నేర్చుకోవాలి. కవిత్వం రాస్తూ, పాటలు పాడుతూ తమ ఆందోళనలకు మరో సృజన రూపం ఇస్తూ ట్విటర్ వేదికగా తమ గోడు చెప్పుకుంటున్నారే కానీ ఎక్కడా సర్కారును ఆడిపోసుకోవడం లేదు. నిరసనలు చూసి దేశం నివ్వెర పోతోంది అని అంటే అది నిజంగానే వారి గొప్పతనం. అదే వారి సంయమనానికి ప్రతీక.
12 డిమాండ్లు.. మాకో వీసీ కావాలి. పార్ట్ టైం కాదు ఫుల్ టైం..మాకు కనీస వసతులు కావాలి.. అలానే ల్యాప్ ట్యాప్ లు కావాలి.. మేం చదువుకుంటా ఫుల్ టైం మాతో పాటే ఉంటే అధ్యాపకులు కావాలి..వీటితోపాటు కనీస అవసరాలు తీర్చండి చాలు..మంచి భోజనం పెట్టండి చాలు..అని అడుగుతున్నారు.. ఆరో రోజు అత్యంత శాంతియుత పంథాలో వీరంతా నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా తాము కదలబోం అని చెబుతున్నారు.
ఈ బిడ్డలున్న చోట పోలీసులు ఉన్నా వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. అదనపు బలగాలు వచ్చినా చేసేందుకు ఏమీలేక మిన్నకుండిపోతున్నాయి. ఈ దేశంలో హక్కులను సాధించుకునే పద్ధతి ఇది అని రాకేశ్ టికాయత్ లాంటి ఆందోళనకారులకు సైతం పాఠాలు చెబుతున్నారు వీరు.. ఇది కదా ! కావాలి. అందుకే పిల్లలూ మీకు జేజేలు అని పదే పదే తల్లిదండ్రులతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా అంటున్నారు. ఇప్పుడు పట్టించుకోవాల్సింది.. పరిష్కరించాల్సింది కేసీఆర్ సర్ మాత్రమే!
This post was last modified on June 20, 2022 12:49 pm
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…