ఎండ, వాన పట్టకుండా ఉంటున్నారు. అబ్బా! ఇంటికి పొండి మీకు సెలవులు ఇచ్చేస్తాం అని కేసీఆర్ అంటూ ఉంటే పట్టించుకోకుండా అక్కడే ఉండిపోతున్నారు ఆ బిడ్డలు. నిరసనకు ఓ కొత్త నిర్వచనం చెబుతున్న ఈ బిడ్డలు తాము అనుకున్నవి సాధించే వరకూ తరగతి గదుల్లోకి తొంగి చూడం అని అంటున్నారు. ఇది కదా ! కావాలి..బాసర విద్యార్థులు (ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అని రాయాలి) దేశానికే ఒక కొత్త మార్గం చూపుతున్నారు. ఆందోళనల్లో కొత్త అధ్యాయం ఇది. అస్సలు ఎవ్వరూ మాట్లాడరు.. ఎవ్వరూ అదే పనిగా అరవరు.. తామేం చెప్పాలనుకుంటున్నామో అవి మాత్రమే ఇప్పటికే చెప్పి ఊరుకున్నారు.
సబితమ్మ (విద్యాశాఖ మంత్రి) ఇవన్నీ సిల్లీ డిమాండ్లు అన్నా నవ్వి ఊరుకున్నారే కానీ నోరేసుకుని పడిపోలేదు. మంచి విద్యను కోరుకోవడం మా బిడ్డల హక్కు అని తల్లిదండ్రులు అంతా గొంతెత్తుతున్నారు. ఇది చూసి మొన్నటి అగ్నిపథ్ ఆందోళనకారులు నేర్చుకోవాలి. కవిత్వం రాస్తూ, పాటలు పాడుతూ తమ ఆందోళనలకు మరో సృజన రూపం ఇస్తూ ట్విటర్ వేదికగా తమ గోడు చెప్పుకుంటున్నారే కానీ ఎక్కడా సర్కారును ఆడిపోసుకోవడం లేదు. నిరసనలు చూసి దేశం నివ్వెర పోతోంది అని అంటే అది నిజంగానే వారి గొప్పతనం. అదే వారి సంయమనానికి ప్రతీక.
12 డిమాండ్లు.. మాకో వీసీ కావాలి. పార్ట్ టైం కాదు ఫుల్ టైం..మాకు కనీస వసతులు కావాలి.. అలానే ల్యాప్ ట్యాప్ లు కావాలి.. మేం చదువుకుంటా ఫుల్ టైం మాతో పాటే ఉంటే అధ్యాపకులు కావాలి..వీటితోపాటు కనీస అవసరాలు తీర్చండి చాలు..మంచి భోజనం పెట్టండి చాలు..అని అడుగుతున్నారు.. ఆరో రోజు అత్యంత శాంతియుత పంథాలో వీరంతా నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా తాము కదలబోం అని చెబుతున్నారు.
ఈ బిడ్డలున్న చోట పోలీసులు ఉన్నా వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. అదనపు బలగాలు వచ్చినా చేసేందుకు ఏమీలేక మిన్నకుండిపోతున్నాయి. ఈ దేశంలో హక్కులను సాధించుకునే పద్ధతి ఇది అని రాకేశ్ టికాయత్ లాంటి ఆందోళనకారులకు సైతం పాఠాలు చెబుతున్నారు వీరు.. ఇది కదా ! కావాలి. అందుకే పిల్లలూ మీకు జేజేలు అని పదే పదే తల్లిదండ్రులతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా అంటున్నారు. ఇప్పుడు పట్టించుకోవాల్సింది.. పరిష్కరించాల్సింది కేసీఆర్ సర్ మాత్రమే!
This post was last modified on June 20, 2022 12:49 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…