Political News

షర్మిల ఎంపిక వ్యూహాత్మకమేనా ?

వైఎస్సార్టీపీ అద్యక్షురాలు చేసిన ప్రకటన వ్యూహాత్మకమేనా ? ఇపుడిదే చర్చ తెలంగాణా రాజకీయాల్లో మొదలైంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. షర్మిల ప్రకటనపై రాజకీయపార్టీల్లో చర్చలు మొదలైతే ఖమ్మం జిల్లాలో అయితే ఒక్కసారిగా వేడి రాజుకుంది. పాలేరు నుండి పోటీచేయాలన్న షర్మిల ప్రకటన వ్యూహాత్మకమనే చెప్పాలి.

ఎలాగంటే యావత్ తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో దివంగత సీఎం వైఎస్సార్ కు స్ట్రాంగ్ మద్దతుదారులు, అభిమానులున్న విషయం తెలిసిందే. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ మున్సిపల్ ప్రాంతం, కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలో చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ జిల్లాలన్నింటితో పోల్చితే ఖమ్మంలో ఇంకా ఎక్కువగా ఉన్నారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే 2014లో వైఎస్ బొమ్మపెట్టుకుని ప్రచారం చేస్తేనే ఒక ఎంపీ, ముగ్గురు ఎంఎల్ఏలు వైసీపీ తరపున గెలిచారు.

2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన దృష్టిని పూర్తిగా ఏపీ రాజకీయాలమీదే పెట్టారు. ఖమ్మంలో అడిగారు కదాని ఖమ్మం ఎంపీతో పాటు మరో ముగ్గురికి అసెంబ్లీ టికెట్లిచ్చారు. ఒక్కసారి కూడా జిల్లాలో జగన్ ప్రచారం చేయలేదు. అయినా ఖమ్మం ఎంపీతో పాటు పినపాక, వైరా, అశ్వరావుపేట ఎంఎల్ఏలను పార్టీ గెలుచుకున్నది. ఈ విషయాలన్నింటినీ గమనించి, పాలేరులో పూర్తిగా సర్వే చేయించుకున్న తర్వాతే షర్మిల ఇక్కడినుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇపుడు జిల్లాలో జరుగుతున్న యాత్రకు కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు. పాలేరు నియోజకవర్గం ఎస్సీ కోటాలో ఉన్నా పెత్తనమంతా రెడ్లదే. ఓటర్లలో మెజారిటి ఎస్టీ, ఎస్సీలే. అలాంటిదిపుడు ఓపెన్ అయ్యింది. అందుకనే రెడ్లు పోటీపడుతున్నారు. రెడ్ల ఆధిపత్యంలో ఎస్టీ, ఎస్సీలు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతే పాలేరులో పోటీకి షర్మిల రెడీ అయిపోయారు. వ్యూహాత్మకంగా ఎంపికచేసుకున్న పాలేరులో ఫలితం సంగతి వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందనటంలో ఏమీ సందేహంలేదు.

This post was last modified on June 20, 2022 12:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

4 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

5 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

5 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

6 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

6 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

7 hours ago