Political News

జ‌న‌సేన కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రాష్ట్రాన్ని బాగు చేస్తాం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాప‌ట్ల జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. గ‌త మూడేళ్ల‌లో ఈ జిల్లాలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలురైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఆయా కుటుంబాల‌కు రూ. ల‌క్ష చొప్పున ప‌రిహారం అందించారు. అనంత‌రం.. జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ప‌రుచూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తులు పెట్టుకుంటామ‌నేది.. ఇప్పుడే చెప్ప‌బోన‌ని అన్నారు.

త‌మ‌కు ప్ర‌జ‌ల‌తోనే పొత్తులు ఉంటాయ‌ని ప‌వ‌న్ అన్నారు. అక్ర‌మాలు, లంచ‌గొండి త‌నాల‌కు జ‌న‌సేన దూరంగా ఉంటుంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పొత్తులు ప్ర‌జ‌ల‌తోనే ఉంటాయ‌ని చెప్పారు. ప్ర‌జ‌లతో క‌లిసి ఎలా ముందుకు వెళ్లాల‌నే అంశంపైనే తాను ఆలోచిస్తున్న‌ట్టు ప‌వ‌న్ అన్నారు. జ‌న‌సేన‌ను ఒక్క‌సారి ఆశీర్వ‌దించి.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని.. ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ పిలుపుని చ్చారు. ఒక్క‌సారి జ‌న‌సేన‌ను ఆశీర్వ‌దించండి.. రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తాం అని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇష్టాను సారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. అధికారం ఇచ్చారు క‌దా.. ఐదేళ్ల వ‌ర‌కు మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఏమీ పీక‌లేరు.. అన్న‌ట్టుగా.. వారు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. విమ‌ర్శించారు. అందుకే.. ప్ర‌జాస్వామ్యంలో త‌మ‌కు న‌చ్చ‌ని.. త‌మ‌కు ప‌నులు చేయ‌ని.. దౌర్జ‌న్యాలు చేసే ఎమ్మెల్యేల‌ను రీకాల్ చేసేలా మార్పులు జ‌ర‌గాల్సి ఉంద‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ద‌స‌రా త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల్లోకి వ‌స్తామ‌ని చెప్పిన‌.. ప‌వ‌న్‌.. ఇంటింటికీ తిరిగే ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్టు చెప్పారు.

వైసీపీ స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. మేం నిల‌బ‌డ‌తాం.. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించండి! అని ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలో ప్ర‌జ‌ల కోస‌మే.. టీడీపీ స‌హా ప్ర‌ధాని మోడీ, బీజేపీల‌తోనూ విభేదించిన‌ట్టు ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఇచ్చిన హామీల‌ను వైసీపీ ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేక పోయింద‌ని ప‌వ‌న్ దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వైసీపీ పాల‌కులు కోల్పోయార‌ని విమ‌ర్శించారు. వైసీపీ నేత‌లు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నార‌ని అన్నారు. 2014లోనే తాను వ‌చ్చి ఉంటే.. రాష్ట్రం ప‌రిస్థితి ఇలా ఉండేది కాద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on June 19, 2022 8:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఆషురెడ్డి ఆడియో వైరల్

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్‌కు…

6 minutes ago

ఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలా

జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా చాలా మంచి పేరు సంపాదించింది హైద‌రాబాద్ అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. లోక‌ల్ హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం…

7 hours ago

రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…

9 hours ago

క‌న్నీళ్ల‌తో ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్త‌రాది అమ్మాయి పాయ‌ల్ రాజ్‌పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయ‌ల్…

10 hours ago

చిరంజీవిని వాడుతున్న జెట్లీ సింహం

ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…

11 hours ago

దురంధర్ కాంబో రిపీట్ కానుందా

ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…

12 hours ago