Political News

జ‌న‌సేన కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రాష్ట్రాన్ని బాగు చేస్తాం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాప‌ట్ల జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. గ‌త మూడేళ్ల‌లో ఈ జిల్లాలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలురైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఆయా కుటుంబాల‌కు రూ. ల‌క్ష చొప్పున ప‌రిహారం అందించారు. అనంత‌రం.. జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ప‌రుచూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తులు పెట్టుకుంటామ‌నేది.. ఇప్పుడే చెప్ప‌బోన‌ని అన్నారు.

త‌మ‌కు ప్ర‌జ‌ల‌తోనే పొత్తులు ఉంటాయ‌ని ప‌వ‌న్ అన్నారు. అక్ర‌మాలు, లంచ‌గొండి త‌నాల‌కు జ‌న‌సేన దూరంగా ఉంటుంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పొత్తులు ప్ర‌జ‌ల‌తోనే ఉంటాయ‌ని చెప్పారు. ప్ర‌జ‌లతో క‌లిసి ఎలా ముందుకు వెళ్లాల‌నే అంశంపైనే తాను ఆలోచిస్తున్న‌ట్టు ప‌వ‌న్ అన్నారు. జ‌న‌సేన‌ను ఒక్క‌సారి ఆశీర్వ‌దించి.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని.. ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ పిలుపుని చ్చారు. ఒక్క‌సారి జ‌న‌సేన‌ను ఆశీర్వ‌దించండి.. రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తాం అని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇష్టాను సారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. అధికారం ఇచ్చారు క‌దా.. ఐదేళ్ల వ‌ర‌కు మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఏమీ పీక‌లేరు.. అన్న‌ట్టుగా.. వారు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. విమ‌ర్శించారు. అందుకే.. ప్ర‌జాస్వామ్యంలో త‌మ‌కు న‌చ్చ‌ని.. త‌మ‌కు ప‌నులు చేయ‌ని.. దౌర్జ‌న్యాలు చేసే ఎమ్మెల్యేల‌ను రీకాల్ చేసేలా మార్పులు జ‌ర‌గాల్సి ఉంద‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ద‌స‌రా త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల్లోకి వ‌స్తామ‌ని చెప్పిన‌.. ప‌వ‌న్‌.. ఇంటింటికీ తిరిగే ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్టు చెప్పారు.

వైసీపీ స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. మేం నిల‌బ‌డ‌తాం.. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించండి! అని ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలో ప్ర‌జ‌ల కోస‌మే.. టీడీపీ స‌హా ప్ర‌ధాని మోడీ, బీజేపీల‌తోనూ విభేదించిన‌ట్టు ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఇచ్చిన హామీల‌ను వైసీపీ ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేక పోయింద‌ని ప‌వ‌న్ దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వైసీపీ పాల‌కులు కోల్పోయార‌ని విమ‌ర్శించారు. వైసీపీ నేత‌లు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నార‌ని అన్నారు. 2014లోనే తాను వ‌చ్చి ఉంటే.. రాష్ట్రం ప‌రిస్థితి ఇలా ఉండేది కాద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on June 19, 2022 8:48 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

10 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

11 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

12 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

13 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago