Political News

జ‌డ్చ‌ర్ల అభ్య‌ర్థిని అమెరికాలో ఖ‌రారు చేసిన రేవంత్‌..!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోందా..? ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదికి పైగా స‌మ‌యం ఉండ‌గానే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిని ముందే ఖ‌రారు చేసుకుంటోందా..? ఈ దిశ‌గా పార్టీ చీఫ్ రేవంత్ బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను వెతికే ప‌నిలో ప‌డ్డారా..? అందులో భాగంగానే జ‌డ్చ‌ర్ల అభ్య‌ర్థిని ఫిక్స్ చేశారా..? అదీ రేవంత్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి.

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌టన చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అమెరికాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొనేందుకు రేవంత్ పార్టీ మ‌రో ఎంపీ కోమ‌టి రెడ్డి, ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీతో క‌లిసి వెళ్లారు. రాష్ట్రంలో చింత‌న్ శిబిర్ తీర్మానాల స‌మావేశం, ర‌చ్చబండ కార్య‌క్ర‌మాలు న‌డుస్తూండ‌గానే వీరు దాదాపు ప‌దిహేను రోజుల పాటు అగ్ర దేశంలో ప‌ర్య‌టించారు.

ఎన్నారైల‌ను కాంగ్రెస్ ద‌రికి చేర్చేందుకు.. అక్క‌డి వ్య‌వ‌సాయ విధానాల‌ను ప‌రిశీలించేందుకు రేవంత్ త‌గిన స‌మ‌యం కేటాయించారు. అలాగే రాజ‌కీయ ప‌రంగా రెండు కీల‌క సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఒక‌టి జ‌డ్చ‌ర్ల అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌డం.. మ‌రొక‌టి బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు బండ్రు శోభారాణిని కాంగ్రెసులో చేర్చుకోవ‌డం. రెండో విష‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ మొద‌టి విష‌యంలోనే పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జరుగుతోంది.

అమెరికాలో ప‌ర్య‌ట‌న‌లో రేవంత్‌ ఖ‌రారు చేసిన జ‌డ్చ‌ర్ల అభ్య‌ర్థి ఎవ‌రో కాదు.. ఎంపీ కోమ‌టి రెడ్డి అనుచ‌రుడు అనిరుధ్ రెడ్డి. వీరితో పాటు అమెరికాకు వెళ్లిన అనిరుధ్ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు.. అక్క‌డి త‌న కార్య‌క్ర‌మాలు.. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను పార్టీ అగ్ర‌నేత‌ల‌కు వివ‌రించార‌ట‌. దీంతో ఆయ‌న చురుకుద‌నాన్ని గ‌మ‌నించిన రేవంత్‌, కోమ‌టి రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేసుకోవాల‌ని.. టికెట్ ఇప్పించే బాధ్య‌త మాదే అని హామీ ఇచ్చార‌ట‌.

అయితే.. ఈ సీటు కోస‌మే గంపెడాశ‌లు పెట్టుకున్న మ‌రో ఇద్ద‌రు నేత‌లు మాత్రం హ‌తాశుల‌య్యార‌ట‌. ఈ స్థానంపై క‌న్నేసిన ఇద్ద‌రూ రేవంత్ అనుచ‌రులు కావ‌డం గ‌మ‌నార్హం. రేవంత్ కుడిభుజంగా చెప్పుకుంటున్న మ‌ల్లు ర‌వి ఈ సారి ఎలాగైనా ఇక్క‌డి నుంచి గెల‌వాల‌ని చూస్తున్నారు. క్రితం ఎన్నిక‌ల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న మ‌రోసారి పోటీకి ఆస‌క్తి చూపుతున్నారు.

ఈయ‌న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్ కూడా కాంగ్రెసు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. క్రితం ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న ఈసారి లోక‌ల్ గానే పోటీ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. వీరిలా ప్ర‌య‌త్నాలు చేసుకుంటుండ‌గానే అనిరుధ్ రెడ్డిని ఖ‌రారు చేయ‌డంతో తీవ్రంగా నిరుత్సాహప‌డిపోయార‌ట‌. ఎన్నిక‌ల నాటికి ఆయ‌నే అభ్య‌ర్థిగా తేలుతారా.. లేదా స‌మీక‌ర‌ణాల్లో భాగంగా త‌మ‌కు అవ‌కాశం వ‌స్తుందా అనే ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

41 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago