ఆయన రెండో సారికూడా జగన్ మంత్రి వర్గంలో చోటు సంపాయించుకున్నారు. ఆయనే బీసీ సామాజిక వర్గం శెట్టి బలిజ కమ్యూనిటికీ చెందిన చెల్లుబోయిన శ్రీనివాసవేణు గోపాలకృష్ణ. 2020లో అనూహ్యంగా ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించిన జగన్.. వారి స్థానంలో ఒక సీటును చెల్లుబోయినకు కట్టబెట్టారు. తర్వాత ఈ ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనూ ఆయనకు చోటు కల్పించారు. కీలకమైన సమాచార, ప్రసార శాఖల మంత్రిని చేశారు.
అయితే.. ఆయనకు ఈ పదవి ఇష్టంలేదో.. లేక ఈ శాఖలో పనిలేదని అనుకున్నారో తెలియదు కానీ.. ఆయన వారానికి రెండు సార్లు చొప్పున ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 11న జరగ్గా.. ఇప్పటికి కేవలం 60 రోజులు దాటింది. ఈ60 రోజుల వ్యవధిలో ఆయన 20 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శించుకోవడం తప్పుకాకపోయినా.. ఈ రేంజ్లో తిరుమల ప్రయాణాలు పెట్టుకోవడం.. శ్రీవారిని దర్శించుకోవడంపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
సీఎం జగన్ సార్.. ఆ మంత్రికి వేరే పనేదైనా అప్పగించండి! అనే కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గతంలో మంత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు.. ఆలయ అధికారులు దగ్గరుండి.. దర్శనం చేయించారు. ఇలా ఒకటి రెండు సార్లు చేశాక.. వారికి కూడా విసుగు వచ్చిందో ఏమో.. వెంటనే.. వారు కూడా ఆయన వెంట రావడం మానేసి.. ఫోర్త్ క్లాస్ టీటీడీ ఎంప్లాయిని పురమాయించి.. చేతులు దులుపుకొన్నారు. ఎందుకంటే.. మంత్రి బిజీ కాకపోయినా.. టీటీడీ ఉద్యోగులు బిజీగా ఉన్నారని.. అందుకే ఇలా చేసి ఉంటారని అంటున్నారు.
వాస్తవానికి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంమంత్రులకు.. గడప గడపకు కార్యక్రమాన్ని అప్పగించింది. కానీ.. మంత్రి చెల్లుబోయిన ఈ కార్యక్రమాన్ని ఒకసారి నిర్వహించి.. పక్కకు తప్పుకొన్నారు. అప్పటి నుంచి ప్రజలను కలవలేదు. ప్రజల మధ్య కు వెళ్లిన తొలిసారి ఎదురు గాలి వీచింది. దీంతో ఆ కార్యక్రమాన్ని ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించి.. ఇదిగో ఇలా.. ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిని గమనించే నెటిజన్లు.. ఆయనపై ఆసక్తికర ట్రోల్స్ చేస్తుండడం గమనార్హం.ఏదైనా సందర్భం ఉంటే.. ఆలయానికి వచ్చినా బాగుంటుందని.. ఇలా వారానికి రెండు సార్లు వస్తుంటే.. తాము మాత్రం ఏర్పాట్లు ఏం చేయగలమని.. టీటీడీ ఉద్యోగులు సైతం పెదవి విరుస్తున్నారు.
This post was last modified on June 18, 2022 7:06 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…