Political News

అప్పుడు రైతులు.. ఇప్పుడు జ‌వాన్లు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్‌లతో పెట్టుకున్నారని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఆయ‌న స‌టైర్లు వేశారు. ఇదేనా మీ పాల‌న‌! అంటూ.. నిప్పులు చెరిగారు.

‘అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో పెన్షన్ వరకు!’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం కేటీఆర్ ట్వీట్‌కు జోరుగా లైకులు ప‌డుతున్నాయి.

అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భగ్గుమంది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న బస్సులను ఆర్మీ ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తూ.. శిక్ష‌ణ కూడా తీసుకుంటున్న‌ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అక్కడికి పోలీసులు చేరడంతో పరుగు ప‌రుగున రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి అక్కడి రైళ్లను ధ్వంసం చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నామరూపాల్లేకుండా చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు. అనంతరం బలగాలను రప్పించుకుని ఆందోళకారులపైకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఒక‌రు మ‌ర‌ణించ‌గా పదుల సంఖ్య‌లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు.

This post was last modified on June 17, 2022 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

3 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

5 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

5 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

6 hours ago