సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్లతో పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన సటైర్లు వేశారు. ఇదేనా మీ పాలన! అంటూ.. నిప్పులు చెరిగారు.
‘అగ్నివీర్ స్కీమ్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో పెన్షన్ వరకు!’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్కు జోరుగా లైకులు పడుతున్నాయి.
అగ్నిపథ్’ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భగ్గుమంది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న బస్సులను ఆర్మీ ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తూ.. శిక్షణ కూడా తీసుకుంటున్న అభ్యర్థులు ధ్వంసం చేశారు. అక్కడికి పోలీసులు చేరడంతో పరుగు పరుగున రైల్వే స్టేషన్లోకి వెళ్లి అక్కడి రైళ్లను ధ్వంసం చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నామరూపాల్లేకుండా చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు. అనంతరం బలగాలను రప్పించుకుని ఆందోళకారులపైకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా పదుల సంఖ్యలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…