టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట వారిని లోపలికి రానీయడం లేదు. ప్రభాకర్రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యుల మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ ఆస్తులకు సంబంధించిన వివిధ పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉమ్మడి ఆస్తుల వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు సమచారం.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాకుండా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
ఈడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలు స్తోంది. తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇళ్లలోనే ఉన్నారు. అదేవిధంగా క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈడీ తనిఖీ సమయంలో జేసీ ప్రభాకర్రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ దివాకర్రెడ్డి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.
This post was last modified on June 17, 2022 2:13 pm
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…