Political News

టీడీపీ-బీజేపీల విష‌యంలో 2019 త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్‌..!

ఈ చిత్రం చూశారా.. ఒక‌రు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు, మ‌రొక‌రు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు. వారే.. కింజ‌రాపు అచ్చ‌న్నాయుడు, సోము వీర్రాజు. 2019 త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌రికొక‌రు ముభావంగా ఉన్నారే త‌ప్ప‌.. ఎవ‌రు ఎవ‌రితోనూ క‌లిసి మాట్లాడుకున్నది లేదు. పైగా.. ఎదురు ప‌డే అవ‌కాశం వ‌చ్చినప్పటికీ త‌ప్పించు కుని తిరిగిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఒక‌ఫంక్ష‌న్‌లో క‌లుసుకున్నారు. ఒక‌రికొక‌రు కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు.

ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలు వ‌స్తున్న నేప‌థ్యం లో ఈ ఇద్ద‌రు నాయ‌కుల క‌ర‌చాల‌నం.. ప‌ల‌క‌రింపుల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. శ్రీకాకుళం జిల్లాలో అటు టీడీపీ, ఇటు బీజేపీలు వేర్వేరుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన అచ్చెన్నా యుడుకు సోము వీర్రాజు ఎదురు ప‌డ్డారు. దీంతో సోమే ముందుగా.. అచ్చెన్నా ఎలా ఉన్నావ్‌! అంటూ.. ప‌ల‌క‌రించారు. దీనికి ప్ర‌తిగా అచ్చెన్నాయుడు.. వీర్రాజ‌న్నా… ఎలా ఉన్నారు! అంటూ.. ప‌ల‌క‌రించారు.

వాస్త‌వానికి 2019 త‌ర్వాత‌.. అటు టీడీపీ, ఇటుబీజేపీలు అనేక కార్య‌క్ర‌మాలునిర్వ‌హించాయి. ఇసుక‌, రాజ‌ధా ని.. వంటి కీల‌క అంశాల‌పై ఉద్య‌మాలు చేసిన‌ప్పుడు కూడా… రెండు పార్టీలు కూడా.. దూర‌దూరంగానే వ్య‌వ‌హరించాయి. అంతేకాదు.. కొన్ని సంద‌ర్భాల్లో టీడీపీ నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇచ్చిన స‌మ‌యంలో బీజేపీ వాయిదా వేసుకున్న ప‌రిస్థితి కూడా ఉంది.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌లకు సంబంధించి పొత్తుల విష‌యంలో రెండు పార్టీల మ‌ధ్య సామ‌ర‌స్యం ఉండాల నే సంకేతాలు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా ఈ రెండు పార్టీలు చేరువ అవుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచి నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా ముందుకు అడుగులు వేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మొత్తానికి అచ్చెన్న, సోముల క‌ల‌యిక‌, ప‌రిచ‌యాలు.. వంటివి రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతున్నాయి.

This post was last modified on June 15, 2022 10:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

54 minutes ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

2 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

2 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

4 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

4 hours ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

4 hours ago