Political News

టీడీపీ-బీజేపీల విష‌యంలో 2019 త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్‌..!

ఈ చిత్రం చూశారా.. ఒక‌రు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు, మ‌రొక‌రు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు. వారే.. కింజ‌రాపు అచ్చ‌న్నాయుడు, సోము వీర్రాజు. 2019 త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌రికొక‌రు ముభావంగా ఉన్నారే త‌ప్ప‌.. ఎవ‌రు ఎవ‌రితోనూ క‌లిసి మాట్లాడుకున్నది లేదు. పైగా.. ఎదురు ప‌డే అవ‌కాశం వ‌చ్చినప్పటికీ త‌ప్పించు కుని తిరిగిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఒక‌ఫంక్ష‌న్‌లో క‌లుసుకున్నారు. ఒక‌రికొక‌రు కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు.

ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలు వ‌స్తున్న నేప‌థ్యం లో ఈ ఇద్ద‌రు నాయ‌కుల క‌ర‌చాల‌నం.. ప‌ల‌క‌రింపుల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. శ్రీకాకుళం జిల్లాలో అటు టీడీపీ, ఇటు బీజేపీలు వేర్వేరుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన అచ్చెన్నా యుడుకు సోము వీర్రాజు ఎదురు ప‌డ్డారు. దీంతో సోమే ముందుగా.. అచ్చెన్నా ఎలా ఉన్నావ్‌! అంటూ.. ప‌ల‌క‌రించారు. దీనికి ప్ర‌తిగా అచ్చెన్నాయుడు.. వీర్రాజ‌న్నా… ఎలా ఉన్నారు! అంటూ.. ప‌ల‌క‌రించారు.

వాస్త‌వానికి 2019 త‌ర్వాత‌.. అటు టీడీపీ, ఇటుబీజేపీలు అనేక కార్య‌క్ర‌మాలునిర్వ‌హించాయి. ఇసుక‌, రాజ‌ధా ని.. వంటి కీల‌క అంశాల‌పై ఉద్య‌మాలు చేసిన‌ప్పుడు కూడా… రెండు పార్టీలు కూడా.. దూర‌దూరంగానే వ్య‌వ‌హరించాయి. అంతేకాదు.. కొన్ని సంద‌ర్భాల్లో టీడీపీ నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇచ్చిన స‌మ‌యంలో బీజేపీ వాయిదా వేసుకున్న ప‌రిస్థితి కూడా ఉంది.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌లకు సంబంధించి పొత్తుల విష‌యంలో రెండు పార్టీల మ‌ధ్య సామ‌ర‌స్యం ఉండాల నే సంకేతాలు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా ఈ రెండు పార్టీలు చేరువ అవుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచి నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా ముందుకు అడుగులు వేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మొత్తానికి అచ్చెన్న, సోముల క‌ల‌యిక‌, ప‌రిచ‌యాలు.. వంటివి రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతున్నాయి.

Satya

Recent Posts

శ్రీముఖి భలే ఛాన్స్ పట్టేసింది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…

1 hour ago

వైసీపీ స్ట్రాట‌జీ: కాపులతో క‌లివిడా.. విడివిడా?

కాపుల విష‌యంలో ఏం చేయాల‌న్న అంశంపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? వారితో క‌లిసి ముందుకు సాగాలా? లేక‌.. వారిని…

4 hours ago

అమెరికా-ఇరాన్‌… మిగిల్చిందేంటి?

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28. ప్ర‌పంచం క‌ళ్లు తెరుస్తున్న స‌మ‌యం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్…

9 hours ago

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

13 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

14 hours ago

నిషేధం చిన్న చ‌ర్యే: టెలిగ్రామ్ యాప్‌కు కోర్టు షాక్‌!

త‌మ‌పై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాల‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగానే కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌పై నిషేధం విధించింద‌ని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును…

14 hours ago