ఈ చిత్రం చూశారా.. ఒకరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మరొకరు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. వారే.. కింజరాపు అచ్చన్నాయుడు, సోము వీర్రాజు. 2019 తర్వాత.. ఇప్పటి వరకు ఒకరికొకరు ముభావంగా ఉన్నారే తప్ప.. ఎవరు ఎవరితోనూ కలిసి మాట్లాడుకున్నది లేదు. పైగా.. ఎదురు పడే అవకాశం వచ్చినప్పటికీ తప్పించు కుని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ ఇద్దరు నాయకులు ఒకఫంక్షన్లో కలుసుకున్నారు. ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యం లో ఈ ఇద్దరు నాయకుల కరచాలనం.. పలకరింపులకు ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో అటు టీడీపీ, ఇటు బీజేపీలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన అచ్చెన్నా యుడుకు సోము వీర్రాజు ఎదురు పడ్డారు. దీంతో సోమే ముందుగా.. అచ్చెన్నా ఎలా ఉన్నావ్! అంటూ.. పలకరించారు. దీనికి ప్రతిగా అచ్చెన్నాయుడు.. వీర్రాజన్నా… ఎలా ఉన్నారు! అంటూ.. పలకరించారు.
వాస్తవానికి 2019 తర్వాత.. అటు టీడీపీ, ఇటుబీజేపీలు అనేక కార్యక్రమాలునిర్వహించాయి. ఇసుక, రాజధా ని.. వంటి కీలక అంశాలపై ఉద్యమాలు చేసినప్పుడు కూడా… రెండు పార్టీలు కూడా.. దూరదూరంగానే వ్యవహరించాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో టీడీపీ నిరసనలకు పిలుపు ఇచ్చిన సమయంలో బీజేపీ వాయిదా వేసుకున్న పరిస్థితి కూడా ఉంది.
అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో రెండు పార్టీల మధ్య సామరస్యం ఉండాల నే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రెండు పార్టీలు చేరువ అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయడమే ఉత్తమమని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అచ్చెన్న, సోముల కలయిక, పరిచయాలు.. వంటివి రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.
This post was last modified on June 15, 2022 10:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…