ఈ చిత్రం చూశారా.. ఒకరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మరొకరు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. వారే.. కింజరాపు అచ్చన్నాయుడు, సోము వీర్రాజు. 2019 తర్వాత.. ఇప్పటి వరకు ఒకరికొకరు ముభావంగా ఉన్నారే తప్ప.. ఎవరు ఎవరితోనూ కలిసి మాట్లాడుకున్నది లేదు. పైగా.. ఎదురు పడే అవకాశం వచ్చినప్పటికీ తప్పించు కుని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ ఇద్దరు నాయకులు ఒకఫంక్షన్లో కలుసుకున్నారు. ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యం లో ఈ ఇద్దరు నాయకుల కరచాలనం.. పలకరింపులకు ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో అటు టీడీపీ, ఇటు బీజేపీలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన అచ్చెన్నా యుడుకు సోము వీర్రాజు ఎదురు పడ్డారు. దీంతో సోమే ముందుగా.. అచ్చెన్నా ఎలా ఉన్నావ్! అంటూ.. పలకరించారు. దీనికి ప్రతిగా అచ్చెన్నాయుడు.. వీర్రాజన్నా… ఎలా ఉన్నారు! అంటూ.. పలకరించారు.
వాస్తవానికి 2019 తర్వాత.. అటు టీడీపీ, ఇటుబీజేపీలు అనేక కార్యక్రమాలునిర్వహించాయి. ఇసుక, రాజధా ని.. వంటి కీలక అంశాలపై ఉద్యమాలు చేసినప్పుడు కూడా… రెండు పార్టీలు కూడా.. దూరదూరంగానే వ్యవహరించాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో టీడీపీ నిరసనలకు పిలుపు ఇచ్చిన సమయంలో బీజేపీ వాయిదా వేసుకున్న పరిస్థితి కూడా ఉంది.
అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో రెండు పార్టీల మధ్య సామరస్యం ఉండాల నే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రెండు పార్టీలు చేరువ అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయడమే ఉత్తమమని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అచ్చెన్న, సోముల కలయిక, పరిచయాలు.. వంటివి రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.
This post was last modified on June 15, 2022 10:05 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…