ఈ చిత్రం చూశారా.. ఒకరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మరొకరు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. వారే.. కింజరాపు అచ్చన్నాయుడు, సోము వీర్రాజు. 2019 తర్వాత.. ఇప్పటి వరకు ఒకరికొకరు ముభావంగా ఉన్నారే తప్ప.. ఎవరు ఎవరితోనూ కలిసి మాట్లాడుకున్నది లేదు. పైగా.. ఎదురు పడే అవకాశం వచ్చినప్పటికీ తప్పించు కుని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ ఇద్దరు నాయకులు ఒకఫంక్షన్లో కలుసుకున్నారు. ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యం లో ఈ ఇద్దరు నాయకుల కరచాలనం.. పలకరింపులకు ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో అటు టీడీపీ, ఇటు బీజేపీలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన అచ్చెన్నా యుడుకు సోము వీర్రాజు ఎదురు పడ్డారు. దీంతో సోమే ముందుగా.. అచ్చెన్నా ఎలా ఉన్నావ్! అంటూ.. పలకరించారు. దీనికి ప్రతిగా అచ్చెన్నాయుడు.. వీర్రాజన్నా… ఎలా ఉన్నారు! అంటూ.. పలకరించారు.
వాస్తవానికి 2019 తర్వాత.. అటు టీడీపీ, ఇటుబీజేపీలు అనేక కార్యక్రమాలునిర్వహించాయి. ఇసుక, రాజధా ని.. వంటి కీలక అంశాలపై ఉద్యమాలు చేసినప్పుడు కూడా… రెండు పార్టీలు కూడా.. దూరదూరంగానే వ్యవహరించాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో టీడీపీ నిరసనలకు పిలుపు ఇచ్చిన సమయంలో బీజేపీ వాయిదా వేసుకున్న పరిస్థితి కూడా ఉంది.
అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో రెండు పార్టీల మధ్య సామరస్యం ఉండాల నే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రెండు పార్టీలు చేరువ అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయడమే ఉత్తమమని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అచ్చెన్న, సోముల కలయిక, పరిచయాలు.. వంటివి రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.
This post was last modified on June 15, 2022 10:05 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…