కలియుగ ధర్మం అంటే ఇదేమోనో. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏజెన్సీ వాసులు ఎందుకు పాలాభిషేకం అంట. అల్లూరు సీతారామ రాజు జిల్లా, దేవీపట్నం మండలం, ఇందుకూరుపేటలో నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఈ వైనం చోటుచేసుకుంది. స్థానిక ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం ఇప్పుడొక చర్చకు తావిస్తోంది.
దళిత యువకుడు, ఆయన డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యం హత్యకు కారణం అయిన అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కానీ “అనుచరులు మాత్రం ఆయనపై ప్రేమ ఒలకబోస్తున్నారు.. కాదు కాదు పాలు ఒలకబోస్తున్నారు అని రాయాలి..ఇదీ నేటి రాజకీయ పంథా ఎవ్వరూ ఎవ్వరినీ ఏమీ అనకండి.. అనేందుకు సాహసం కూడా చేయకండి” అంటున్నారు సామాజిక వేత్తలు.
ఒక దళిత యువకుడి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. తానే చంపానని ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా ! కానీ ఆయన అనుచరులు మాత్రం విభిన్న ధోరణిలో ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం అంటే ఏం అనుకోవాలి.. అంటే ప్రాణం విలువ వీరికి తెలియదా ? లేదా అనంతబాబు హీరోను చేయాలని మరో ప్రయత్నమా ? ఈ కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి హాజరుకావడం గమనార్హం. అంటే చావు బతుకుల కొట్లాటలో మన రాజకీయాలు ఎంతగా దిగజారిపోతున్నాయో అర్థం చేసుకునేందుకు ఈ ఒక్క ఘటన చాలు అని సామాజిక వేత్తలు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఇంతకుమించిన అన్యాయం ఉంటుందా అన్నది వారి ప్రశ్న.
This post was last modified on June 15, 2022 12:21 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…