వచ్చే నెల ఎనిమిది, తొమ్మిది తారీఖుల్లో జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా జగన్ ఓ కీలక నిర్ణయం వెలువరించాలనుకుంటున్నారట. ఈ నిర్ణయం కారణంగా వచ్చే సారి ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆరు నెలల ముందు కానీ లేదా పది నెలల ముందు కానీ ప్రకటించే అవకాశాలను పరిశీలిస్తూ సంబంధిత విషయమై ఓ స్పష్టమయిన ప్రకటన చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గతంలోనూ ఇదే విధంగా ఆయన పనిచేసిన దాఖలాలు ఉన్నాయి.
తాజా నిర్ణయాలకు అనుగుణంగా లేదా విరుద్ధంగా అయినా అభ్యర్థుల జాబితా అన్నది ప్లీనరీ సమయానికే ప్రాథమికంగా సిద్ధం అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వైసీపీకి పొత్తుల గోల లేదు. వైసీపీకి సంబంధించి ఇతరుల జోక్యం అంటూ ఉండదు. ఓ విధంగా ఆ పార్టీకి నంబర్ 2 అంటూ ఎవ్వరూ లేరు. ఉండరు కూడా ! అని గతంలోనే తేలిపోయింది. ఇదే మాట సజ్జల రామకృష్ణా రెడ్డి అనే ప్రభుత్వ సలహాదారు ఎప్పుడో చెప్పేశారు. కనుక ప్రజల్లో కాస్తో,కూస్తో విశ్వసనీయత ఉన్నవారికే టిక్కెట్లు అన్నది మరోసారి రుజువు చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధం అవుతున్నారు.
అంతేకాకుండా నియోజకవర్గ ఇంఛార్జులుగా ఉన్నా కూడా, వారందరికీ ఎమ్మెల్యే టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లో దక్కవు. అక్కడ పనితీరే ప్రామాణికం. ఈ సారి కూడా కొన్ని స్థానాలకు గాను కొత్త ముఖాలనే పరిచయం చేసి ఓ ప్రయోగం చేయాలని సీఎం భావిస్తున్నారు. వీలున్నంత వరకూ తెలంగాణలో అమలు అవుతున్న ఫార్ములానే ఇక్కడా ఎప్లై చేయనున్నారు పీకే ప్రతినిధి రిషి. అంటే అక్కడ కూడా సిట్టింగులను తప్పించేయాలని చెప్పిన విధంగానే, ఇక్కడ కూడా చాలా మంది సిట్టింగులకు ముచ్చెమటలు పోయించేలా ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా సిద్ధం అయ్యాయి అని తెలుస్తోంది.
స్థానిక ప్రజాప్రతినిధులు అధికారం దక్కాక ఎలా పనిచేస్తున్నారో చెప్పాలని, ఈ విషయమై తనను పక్కదోవ పట్టించవద్దని పదే, పదే పోలీసు అధికారులను కోరుతున్నారు. సీఎం జగన్ చెప్పిన విధంగా తెరపైకి కొత్త ముఖాల వెలుగు అన్నది రావడం ఖాయం. అదేవిధంగా ముందే అభ్యర్థులను ప్రకటించేక వారితో జిల్లా పార్టీ అధ్యక్షులు పనిచేసే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎలానూ జీరో రిజల్ట్ వచ్చిన వారు ఇంటికే పరిమితం అవుతాం అనుకుంటే కుదరని పని అని కూడా సీఎం తేల్చేశారు. ఇదే ఇప్పుడు టీడీపీని కూడా పునరాలోచనలో పడేసింది. ముందే అభ్యర్థులను చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీలకు కూడా కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని తెలుస్తోంది.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…