వచ్చే నెల ఎనిమిది, తొమ్మిది తారీఖుల్లో జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా జగన్ ఓ కీలక నిర్ణయం వెలువరించాలనుకుంటున్నారట. ఈ నిర్ణయం కారణంగా వచ్చే సారి ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆరు నెలల ముందు కానీ లేదా పది నెలల ముందు కానీ ప్రకటించే అవకాశాలను పరిశీలిస్తూ సంబంధిత విషయమై ఓ స్పష్టమయిన ప్రకటన చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గతంలోనూ ఇదే విధంగా ఆయన పనిచేసిన దాఖలాలు ఉన్నాయి.
తాజా నిర్ణయాలకు అనుగుణంగా లేదా విరుద్ధంగా అయినా అభ్యర్థుల జాబితా అన్నది ప్లీనరీ సమయానికే ప్రాథమికంగా సిద్ధం అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వైసీపీకి పొత్తుల గోల లేదు. వైసీపీకి సంబంధించి ఇతరుల జోక్యం అంటూ ఉండదు. ఓ విధంగా ఆ పార్టీకి నంబర్ 2 అంటూ ఎవ్వరూ లేరు. ఉండరు కూడా ! అని గతంలోనే తేలిపోయింది. ఇదే మాట సజ్జల రామకృష్ణా రెడ్డి అనే ప్రభుత్వ సలహాదారు ఎప్పుడో చెప్పేశారు. కనుక ప్రజల్లో కాస్తో,కూస్తో విశ్వసనీయత ఉన్నవారికే టిక్కెట్లు అన్నది మరోసారి రుజువు చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధం అవుతున్నారు.
అంతేకాకుండా నియోజకవర్గ ఇంఛార్జులుగా ఉన్నా కూడా, వారందరికీ ఎమ్మెల్యే టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లో దక్కవు. అక్కడ పనితీరే ప్రామాణికం. ఈ సారి కూడా కొన్ని స్థానాలకు గాను కొత్త ముఖాలనే పరిచయం చేసి ఓ ప్రయోగం చేయాలని సీఎం భావిస్తున్నారు. వీలున్నంత వరకూ తెలంగాణలో అమలు అవుతున్న ఫార్ములానే ఇక్కడా ఎప్లై చేయనున్నారు పీకే ప్రతినిధి రిషి. అంటే అక్కడ కూడా సిట్టింగులను తప్పించేయాలని చెప్పిన విధంగానే, ఇక్కడ కూడా చాలా మంది సిట్టింగులకు ముచ్చెమటలు పోయించేలా ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా సిద్ధం అయ్యాయి అని తెలుస్తోంది.
స్థానిక ప్రజాప్రతినిధులు అధికారం దక్కాక ఎలా పనిచేస్తున్నారో చెప్పాలని, ఈ విషయమై తనను పక్కదోవ పట్టించవద్దని పదే, పదే పోలీసు అధికారులను కోరుతున్నారు. సీఎం జగన్ చెప్పిన విధంగా తెరపైకి కొత్త ముఖాల వెలుగు అన్నది రావడం ఖాయం. అదేవిధంగా ముందే అభ్యర్థులను ప్రకటించేక వారితో జిల్లా పార్టీ అధ్యక్షులు పనిచేసే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎలానూ జీరో రిజల్ట్ వచ్చిన వారు ఇంటికే పరిమితం అవుతాం అనుకుంటే కుదరని పని అని కూడా సీఎం తేల్చేశారు. ఇదే ఇప్పుడు టీడీపీని కూడా పునరాలోచనలో పడేసింది. ముందే అభ్యర్థులను చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీలకు కూడా కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని తెలుస్తోంది.
This post was last modified on June 15, 2022 12:12 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…