వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు భారీ ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు నుంచి ఏడాదిలోపు 100 నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఏడాదిపాటు జిల్లాల్లో పర్యటనలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. జిల్లాల పర్యటన ఈరోజు అంటే బుధవారం నుండే ప్రారంభమవుతున్నాయి. తన పర్యటనను అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంతో చంద్రబాబు మొదలు పెట్టబోతున్నారు.
‘ఎన్టీయార్ స్పూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో ఏడాది పాటు జిల్లాల పర్యటనలను ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, విధ్వంస పాలనను ఎండగడుతూ, ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించటమే ధ్యేయంగా చంద్రబాబు పర్యటనలు సాగబోతున్నాయి. పార్టీ క్యాడర్, ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రతి జిల్లాలోని మినీ మహానాడును మూడురోజులు జరపాలని చంద్రబాబు ఆదేశించారు.
మూడు రోజుల మహానాడులో జిల్లాలోని నేతలందరూ పార్టిసిపేట్ చేయాలని చంద్రబాబు చెప్పారు. రెండు రోజులు పార్టీ పరిస్ధితి, ప్రభుత్వ వైఫల్యాలను చర్చిస్తారు. మూడోరోజు జిల్లాలోని పబ్లిక్ ను ఇన్వాల్వ్ చేస్తు బహిరంగ సభలు నిర్వహించాలని చెప్సారు. గురువారం జిల్లాలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. మూడోరోజు శుక్రవారం బాదుడే బాదుడు, ప్రజా సమస్యలే టార్గెట్ గా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో రోడ్డుషో నిర్వహించబోతున్నారు.
ఇదే పద్దతిలో ప్రతినెలా రెండు జిల్లాల్లో పర్యటించేలా చంద్రబాబు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఏడాదికి 100 నియోజకవర్గాల్లో రోడ్డుషోల్లో పాల్గొనబోతున్నారు. గతంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తర్వాత ఒంగోలులో రెండురోజుల మహానాడును నిర్వహించారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి, మహానాడు బహిరంగ సభకు జనాలు బాగా వచ్చారు కాబట్టి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని చంద్రబాబు అనుకుంటున్నారు.
అయితే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇది నూరు శాతం కచ్చితమైన ప్రామాణికమేమీ కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఏదేమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావటానికి ప్రతిపక్షాలు ప్రయత్నించటం స్వాగతించాల్సిందే. మరి చివరకు వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.
This post was last modified on June 15, 2022 12:12 pm
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…