Political News

వైఎస్ భిక్ష‌తోనే రాజ‌కీయాల్లోకి: కొండా సురేఖ

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కురాలిగా ఉన్న ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ‌.. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొండా దంప‌తుల య‌దార్థ జీవిత క‌థ ఆధారంగా.. డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ నిర్మించిన ‘కొండా’ మూవీ.. ప్ర‌మోష‌న్ కోసం.. కొండా సురేఖ‌.. విజ‌య‌వాడ వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా తొలుత ఆమె.. విజ‌య‌వాడ బ‌స్టాండ్ స‌మీపంలోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద ఉన్న వైఎస్ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళలర్పించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కొండ’ దంపతుల జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకు సినిమా తీసిన‌ట్టు వివ‌రించారు. ఎన్ని ఒడుడుకులు ఎదురైనా నిజ జీవితంలో ఎదుర్కొని నిల‌బ‌డిన‌ట్టు సురేఖ చెప్పారు.

దివంగ‌త వైఎస్ఆర్ రాజకీయ బిక్షతోనే తాము ఈ స్థితిలో ఉన్నామ‌ని సురేఖ వెల్ల‌డించారు. నేటి రాజకీయాల్లో విలువలు అనేవి లేవని విమ‌ర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని దుయ్య‌బ‌ట్టారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చెయ్యాలని సూచించారు. వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ కుటుంబాన్ని కలిసింది లేదని, వైఎస్ఆర్ తోనే త‌మ‌కు అనుబంధం ఉందని సురేఖ చెప్పారు.

వైఎస్ కుటంబ సభ్యులతో త‌న‌కు కానీ, త‌న కుటుంబానికి కానీ.. ఎలాంటి సంబంధం లేద‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసాక విజయమ్మ, షర్మిలమ్మతో కోర్టుకు అటెండ్ అయినప్పుడు మాత్రమే మాట్లాడిన‌ట్టు సురేఖ తెలిపారు. ఆ త‌ర్వాత వైఎస్ కుటుంబ సభ్యులను కలిసింది లేదని, మాట్లాడింది కూడా లేదని చెప్పారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నాని తెలిపారు.

This post was last modified on June 13, 2022 9:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది…ఉగాది రోజు 20 సెకన్ల విధ్వంసం

రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు…

2 hours ago

సిసలైన ప్రజాస్వామ్యానికి ప్రతీక తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై…

3 hours ago

నాడు హైటెక్ సిటీ…ఇప్పుడు క్వాంటం వ్యాలీ: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో…

3 hours ago

వంశీకి డబుల్ షాక్… రెండో బెయిల్ పిటిషన్ కొట్టివేత

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు…

3 hours ago

భూకంప విలయం… బ్యాంకాక్, మయన్మార్ లలో భారీ నష్టం

ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను…

6 hours ago

ఆశ చావలేదు.. జాబితా వచ్చేదాకా ఆగేది లేదు

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం…

9 hours ago