ఇపుడిదే అంశం టీఆర్ఎస్ లోనే కాకుండా రాజకీయపార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ప్రాంతీయపార్టీ అయిన టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా మార్చాలని కేసీయార్ అనుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ స్ధానంలో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్రీయ సమితి) తెరమీదకు వచ్చింది.
బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పెట్టిన తర్వాత కేసీయార్ సక్సెస్ విషయంలో చర్చలు ఊపందుకుంటున్నాయి. జాతీయపార్టీ నిలదొక్కుకోవాలంటే అందుకు ఇతర పార్టీల మద్దతు చాలా అవసరం. అందులోను ప్రాంతీయపార్టీ జాతీయపార్టీగా రూపాంతరం చెంది నిలదొక్కుకోవాలంటే చిన్న విషయంకాదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రాంతీయపార్టీ అధినేత హోదాలోనే కేసీయార్ పై మిగిలిన పార్టీల్లో నమ్మకంలేదు.
ఎప్పుడు ఎవరితో ఎలాగుంటారో కేసీయార్ కే తెలీదు. తాను అద్భుతమైన వ్యూహకర్తనని కేసీయార్ కు తనపై తనకు చాలా నమ్మకం. అయితే ఈ వ్యూహాలు తెలంగాణాలోనే ఫెయిలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక జాతీయస్ధాయిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. నరేంద్రమోడికి వ్యతిరేకంగా చాలా మాటలే మాట్లాడారు. చాలెంజులు చేశారు. కొందరు ప్రతిపక్షాల అధినేతలను కలిశారు. అయితే ఎవరూ సానుకూలంగా స్పందించలేదు.
కేసీయార్ తో కలిసి నడవటానికి ఎవరు సిద్ధంగాలేరు. అలాంటిది ఇపుడు జాతీయపార్టీ అధినేతనని చెప్పుకున్నంత మాత్రాన కేసాయార్ తో ఎవరు కలిసొస్తారన్నదే అసలు పాయింట్. జాతీయపార్టీగా మారినపుడు ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీచేయాల్సుంటుంది. అప్పుడు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో పొత్తులు తప్పవు. ఇక్కడే పెద్ద సమస్య ఎదురవబోతోంది. ఏపీలో కేసీయార్ తో పొత్తుపెట్టుకోవటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అలాగే మహారాష్ట్ర, కర్నాటకలో కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే పై రాష్ట్రాల్లోని పార్టీల్లో దేనికీ ఉపయోగం ఉండదు. మహారాష్ట్రతో తెలంగాణాకు జలవివాదాలున్నాయి. కాబట్టి ఏ పార్టీ కూడా కేసీయార్ కు సానుకూలంగా ఉండే అవకాశాలు తక్కువ. ఇక కర్నాటకలో బీఆర్ఎస్ ను పట్టించుకునే వారే ఉండరు. కాబట్టి కేసీయార్ సక్సెస్ పై అనేక అనుమానాలున్నాయి.
This post was last modified on June 13, 2022 12:33 pm
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…