ఇపుడిదే అంశం టీఆర్ఎస్ లోనే కాకుండా రాజకీయపార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ప్రాంతీయపార్టీ అయిన టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా మార్చాలని కేసీయార్ అనుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ స్ధానంలో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్రీయ సమితి) తెరమీదకు వచ్చింది.
బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పెట్టిన తర్వాత కేసీయార్ సక్సెస్ విషయంలో చర్చలు ఊపందుకుంటున్నాయి. జాతీయపార్టీ నిలదొక్కుకోవాలంటే అందుకు ఇతర పార్టీల మద్దతు చాలా అవసరం. అందులోను ప్రాంతీయపార్టీ జాతీయపార్టీగా రూపాంతరం చెంది నిలదొక్కుకోవాలంటే చిన్న విషయంకాదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రాంతీయపార్టీ అధినేత హోదాలోనే కేసీయార్ పై మిగిలిన పార్టీల్లో నమ్మకంలేదు.
ఎప్పుడు ఎవరితో ఎలాగుంటారో కేసీయార్ కే తెలీదు. తాను అద్భుతమైన వ్యూహకర్తనని కేసీయార్ కు తనపై తనకు చాలా నమ్మకం. అయితే ఈ వ్యూహాలు తెలంగాణాలోనే ఫెయిలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక జాతీయస్ధాయిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. నరేంద్రమోడికి వ్యతిరేకంగా చాలా మాటలే మాట్లాడారు. చాలెంజులు చేశారు. కొందరు ప్రతిపక్షాల అధినేతలను కలిశారు. అయితే ఎవరూ సానుకూలంగా స్పందించలేదు.
కేసీయార్ తో కలిసి నడవటానికి ఎవరు సిద్ధంగాలేరు. అలాంటిది ఇపుడు జాతీయపార్టీ అధినేతనని చెప్పుకున్నంత మాత్రాన కేసాయార్ తో ఎవరు కలిసొస్తారన్నదే అసలు పాయింట్. జాతీయపార్టీగా మారినపుడు ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీచేయాల్సుంటుంది. అప్పుడు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో పొత్తులు తప్పవు. ఇక్కడే పెద్ద సమస్య ఎదురవబోతోంది. ఏపీలో కేసీయార్ తో పొత్తుపెట్టుకోవటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అలాగే మహారాష్ట్ర, కర్నాటకలో కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే పై రాష్ట్రాల్లోని పార్టీల్లో దేనికీ ఉపయోగం ఉండదు. మహారాష్ట్రతో తెలంగాణాకు జలవివాదాలున్నాయి. కాబట్టి ఏ పార్టీ కూడా కేసీయార్ కు సానుకూలంగా ఉండే అవకాశాలు తక్కువ. ఇక కర్నాటకలో బీఆర్ఎస్ ను పట్టించుకునే వారే ఉండరు. కాబట్టి కేసీయార్ సక్సెస్ పై అనేక అనుమానాలున్నాయి.
This post was last modified on June 13, 2022 12:33 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…