విపక్షాలను బూతులు తిడితే పదవులు అన్న మాట ఎన్నో సార్లు నిరూపణ అయింది అన్నది ఎప్పటి నుంచో టీడీపీ అంటున్న మాట. ఆ మాటకు వస్తే తిట్టడంతోనే చాలా మంది వైసీపీ నాయకులు పేరు తెచ్చుకున్నారు అని పరిశీలకులు అంటున్నారు.
ఈ లాజిక్ పసిగట్టిన కొందరు వైసీపీ నేతలు డోసు పెంచి మరీ టీడీపీపై పవన్ పై విరుచుకుపడుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. బూతులు వాడితో వచ్చే పదవుల కోసం పరుగులు తీసిన లేదా తీస్తున్న దాఖలాలే ఉన్నాయి అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా లోకేశ్ ను తిట్టిన గుర్రంపాటి దేవెందర్ రెడ్డి అనే వైసీపీ లీడర్ కు పదవీయోగం దక్కిందన్న వాదన నడుస్తోంది.
ఇటీవల పదో తరగతి తప్పిన విద్యార్థులతో లోకేశ్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో చొరబడి తిట్ల దండకం అందుకునేందుకు ప్రయత్నించి కొంత మేరకు అనుకున్న పని సాధించినందుకే ఆయన్ను ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థకు చైర్మన్ ను చేశారు అని ఒక వాదన నడుస్తోంది.
గుర్రంపాటికి ఈ పదవి అనూహ్య పరిణామమే, కానీ దీనికి లోకేష్ సంబంధం ఏంటని కొందరు వైసీపీ నేతల వాదన. నిన్నటి వరకూ సోషల్ మీడియా ఇంఛార్జ్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఈ పదవికి సంబంధించి ఎలా ఎన్నికయ్యారో కూడా ఆశ్చర్యకరమే ! అని సొంత పార్టీలో ఇంకో వర్గం అభిప్రాయపడుతోంది.
ఇంతవరకూ ఈ అభివృద్ధి విభాగం ఉందని, దీనికో చైర్మన్ ఉంటారని తెలియని వారికి కూడా ఓ విధంగా జగన్ తెలియజెప్పారు. గతంలో జగన్ ను టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేసిన అచ్చెన్న తరువాత కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆయన్ను తిట్టిన దువ్వాడ శ్రీను అనే లీడర్ ఇప్పుడు ఎంఎల్సీ అయ్యారు.
మళ్లీ మళ్లీ ఆయన బూతులు తిడుతూనే ఉన్నారు. ఇక నానీల ద్వయం పేర్ని నాని, కొడాలి నాని ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు బాబును మరియు పవన్ ను ! ఎంతగా అంటే బాబు మీరు మీ తిట్లను తగ్గించండయ్యా అన్నా కూడా వినిపించుకోలేనంతగా తిడుతూనే ఉండేవారు. కానీ పదవులు పోయాక వీరిద్దరు తిట్లను పొదుపుగా వాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
This post was last modified on June 12, 2022 11:30 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…