విపక్షాలను బూతులు తిడితే పదవులు అన్న మాట ఎన్నో సార్లు నిరూపణ అయింది అన్నది ఎప్పటి నుంచో టీడీపీ అంటున్న మాట. ఆ మాటకు వస్తే తిట్టడంతోనే చాలా మంది వైసీపీ నాయకులు పేరు తెచ్చుకున్నారు అని పరిశీలకులు అంటున్నారు.
ఈ లాజిక్ పసిగట్టిన కొందరు వైసీపీ నేతలు డోసు పెంచి మరీ టీడీపీపై పవన్ పై విరుచుకుపడుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. బూతులు వాడితో వచ్చే పదవుల కోసం పరుగులు తీసిన లేదా తీస్తున్న దాఖలాలే ఉన్నాయి అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా లోకేశ్ ను తిట్టిన గుర్రంపాటి దేవెందర్ రెడ్డి అనే వైసీపీ లీడర్ కు పదవీయోగం దక్కిందన్న వాదన నడుస్తోంది.
ఇటీవల పదో తరగతి తప్పిన విద్యార్థులతో లోకేశ్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో చొరబడి తిట్ల దండకం అందుకునేందుకు ప్రయత్నించి కొంత మేరకు అనుకున్న పని సాధించినందుకే ఆయన్ను ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థకు చైర్మన్ ను చేశారు అని ఒక వాదన నడుస్తోంది.
గుర్రంపాటికి ఈ పదవి అనూహ్య పరిణామమే, కానీ దీనికి లోకేష్ సంబంధం ఏంటని కొందరు వైసీపీ నేతల వాదన. నిన్నటి వరకూ సోషల్ మీడియా ఇంఛార్జ్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఈ పదవికి సంబంధించి ఎలా ఎన్నికయ్యారో కూడా ఆశ్చర్యకరమే ! అని సొంత పార్టీలో ఇంకో వర్గం అభిప్రాయపడుతోంది.
ఇంతవరకూ ఈ అభివృద్ధి విభాగం ఉందని, దీనికో చైర్మన్ ఉంటారని తెలియని వారికి కూడా ఓ విధంగా జగన్ తెలియజెప్పారు. గతంలో జగన్ ను టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేసిన అచ్చెన్న తరువాత కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆయన్ను తిట్టిన దువ్వాడ శ్రీను అనే లీడర్ ఇప్పుడు ఎంఎల్సీ అయ్యారు.
మళ్లీ మళ్లీ ఆయన బూతులు తిడుతూనే ఉన్నారు. ఇక నానీల ద్వయం పేర్ని నాని, కొడాలి నాని ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు బాబును మరియు పవన్ ను ! ఎంతగా అంటే బాబు మీరు మీ తిట్లను తగ్గించండయ్యా అన్నా కూడా వినిపించుకోలేనంతగా తిడుతూనే ఉండేవారు. కానీ పదవులు పోయాక వీరిద్దరు తిట్లను పొదుపుగా వాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…