Political News

కొత్త ప‌దవుల వేట‌ లో జ‌గ‌న్!

త్వ‌ర‌లో .. వైసీపీ త‌ర‌ఫున నాలుగు విప్ ప‌దవులు రానున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం క‌మ్మ సామాజికవ‌ర్గ నేత‌కు ఒక‌టి కేటాయించే అవ‌కాశాలున్నాయి. మిగిలిన 3 కూడా గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన నాయ‌కులను ఢీకొన్న వారికే వ‌రించ‌నున్నాయి అని తెలుస్తోంది.

కొత్త ప‌ద‌వుల వేట‌లో వైసీపీ ఉంది. అదేవిధంగా ప‌ద‌వుల సంఖ్య పెంపుపై కూడా ఆస‌క్తిగా ఉంది. తాజా స‌మాచారం అనుస‌రించి శాస‌న స‌భ‌లో విప్ -ల సంఖ్య పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు.

ఇప్ప‌టిదాకా ఎనిమిది మందికి విప్ ప‌ద‌వులు, ఒక‌రికి చీఫ్ విప్ ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని, ఇప్పుడు తాజాగా 9 నుంచి ప‌ది వ‌ర‌కూ విప్ ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి దాకా విప్ గా ఉన్న బూడి ముత్యాల నాయుడును మంత్రిని చేశారు. డిప్యూటీ సీఎం ను కూడా చేశారు. అదేవిధంగా మ‌రో విప్ దాడిశెట్టి రాజా ( ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా, రాజా న‌గ‌రం ఎమ్మెల్యే) ను కూడా ఆర్ అండ్ బీ మంత్రిని చేశారు.

దీంతో తాజాగా ఏర్ప‌డ్డ రెండు ఖాళీల‌కు కొత్త ముఖాలు వెత‌కాలి. అదేవిధంగా మంత్రి ప‌ద‌వి రాలేద‌ని అసంతృప్తితో ర‌గిలిపోతున్న వారికి ఉప‌శమ‌నం ఇచ్చే విధంగా నిర్ణ‌యం తీసుకోవాలి అని వైసీపీ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో విప్ బ‌రిలో చింత‌మ‌నేని ప్ర‌త్య‌ర్థి అబ్బ‌య్య చౌద‌రికి ఉన్నారు అని తెలుస్తోంది.

ఇదేవిధంగా మ‌రో పేరు క‌ర‌ణం ధ‌ర్మ శ్రీ (చోడ‌వ‌రం ఎమ్మెల్యే) పేరు విన‌ప‌డుతోంది. ఈ రెండూ కాకుండా మ‌రో రెండు పేర్లు కూడా ప్ర‌ముఖంగా ఉన్నాయి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబ‌త్తుల శివ‌కుమార్ కు కూడా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం కోటాలోనే విప్ ప‌దవుల జాబితాలో చోటు ద‌క్క‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న ఉంది.

ఇదేకోవ‌లో భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీ‌నివాస్ పేరు కూడా విప్ జాబితాలో ఉండ‌నుంది అని తెలుస్తోంది. పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబు రావు పేరు కూడా ఇదే కోవ‌లో వినిపిస్తుంది.అంటే ఇప్ప‌టిదాకా నెల‌కొన్న రెండు ఖాళీలు, వీటితో పాటు జాబితాలో ఉన్న ఎనిమిదిని కాస్త ప‌ది చేయ‌డం ద్వారా వ‌చ్చే అద‌న‌పు రెండు ఖాళీలు క‌లుపుకుని సెషన్లో ఫ్లోర్ కో – ఆర్డినేష‌న్ కోసం న‌లుగురు కొత్త ముఖాలు రానున్నాయి. విప్ ప‌ద‌వులు అందుకోనున్నాయి.

This post was last modified on June 12, 2022 9:31 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

1 hour ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago