Political News

పోలవరం అవినీతి.. ఇది కదా ట్విస్ట్ అంటే

ఆంధ్రప్రదేశ్ గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి. ఈ ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అప్పట్లో తీవ్ర ఆరోపణలే చేసింది. కానీ అవేమీ పట్టించుకోకుండా బాబు సర్కారు వీలైనంత వేగంగానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది.

ఆ ప్రభుత్వమే కొనసాగి ఉంటే ఈపాటికి పోలవం పూర్తి కావచ్చేదేమో. జగన్ సర్కారు వచ్చాక ఈ ప్రాజెక్టు పనులకు బ్రేక్ వేసి.. పనుల్లో అవినీతి మీద దృష్టి పెట్టింది. ఓ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ పోలవరంలో అవినీతి జరిగినట్లు నివేదిక కూడా ఇచ్చింది అప్పట్లో. అది కేంద్ర ప్రభుత్వం వద్దకు కూడా వెళ్లింది.

ఆ తర్వాత ఏం జరిగిందన్నది అప్ డేట్ లేదు. ఐతే ఇప్పుడు జనసేన నేత పెంటపాటి పుల్లారావు.. పోలవరం అవినీతిపై వివరాలు బయట పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా.. ఊహించని సమాధానం రావడం విశేషం. పోలవరంలో అవినీతికి ఆధారాలు లేవని జలశక్తి శాఖ సమాధానం చెప్పడం గమనార్హం.

ఓవైపు జగన్ సర్కారు నియమించిన కమిటీ పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చెప్పింది. గత ఏడాది ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నట్లుగా మాట్లాడారు. పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. ఇలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోలవరం అవినీతిపై అంత వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు బుక్ అయినట్లే అని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ పోలవరంలో అవినీతికి ఆధారాల్లేవని తేల్చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చాక దాన్ని పరిశీలించి ప్రధాన మంత్రి కార్యాలయం.. నివేదికలో పేర్కొన్న అవినీతి ఆరోపణలకు ఆధారాలు కావాలని రెండు మూడుసార్లు లేఖలు రాసినా జగన్ సర్కారు నుంచి బదులు లేదట.

ఈ నివేదికలో ఆరోపణల సంగతి తేలాకే ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్రం మెలిక పెట్టడంతో.. ఆ నివేదికను పక్కన పెట్టాలని జగన్ సర్కారు కేంద్ర జలశక్తి శాఖకు సూచించినట్లు వెల్లడి కావడం గమనార్హం. మొత్తానికి తాజా పరిణామాలతో పోలవరంలో అవినీతి జరగలేదని ఇటు రాష్ట్రం, అటు కేంద్రం ఒప్పుకున్నట్లయింది.

This post was last modified on June 27, 2020 3:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

10 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

11 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

12 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

13 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

14 hours ago