వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడే అవకాశాలు లేవని దాదాపు తేలిపోయింది. అనర్హత పిటిషన్ వేయాలని వైసీపీ, వేసేందుకు లేదని తిరుగుబాటు ఎంపీ లోక్ సభ స్పీకర్ కార్యాలయం వేదికగా పరస్పరం వాదులాడుకుంటున్నారు.
ఎంపీ పై అనర్హత వేటు వేయాల్సిందే అని పట్టుదలగా లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. అయితే ఎవరెంత పోరాటం చేసినా ఎంపీగా అనర్హత వేటు సాధ్యం కాదని స్పీకర్ కార్యాలయం చేసిన ప్రకటనతో అర్థమైపోయింది.
అనర్హత పిటిషన్ పై లోక్ సభ హక్కుల సంఘం విచారణ జరిపింది. పార్టీ జారీచేసిన విప్ ఉల్లంఘించినపుడు మాత్రమే అనర్హత వేటుకు గురవుతారు కానీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసినంతమాత్రాన అనర్హతకు గురికారంటు కమిటి తేల్చి చెప్పేసింది. ఇదే సమయంలో ఎంపీ ఇచ్చిన ఫిర్యాదును కూడా కమిటీ పక్కన పడేసింది.
తన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని రఘురాజు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ పిటీషన్ను కూడా కమిటీ తోసిపుచ్చింది. థర్డ్ డిగ్రీ ప్రయోగం తమ పరిశీలనలోకి రాదని కమిటీ చెప్పేసింది.
పార్లమెంటు విధుల నిర్వహణలో ఎంపీని ఎవరైనా అడ్డుకుంటే మాత్రమే తమ పరిశీలనలోకి వస్తుందని బయట జరిగే గొడవలు తమ పరిధిలోకి రాదని కమిటి స్పష్టంగా చెప్పేసింది. మొత్తానికి ఇటు వైసీపీ అటు రఘురాజు పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు రెండింటినీ కమిటి కొట్టేసింది. అంటే ఎవరు కూడా ప్రత్యర్ధులపై విజయం సాధించినట్లు కాదు.
కానీ ఎంపీ పై అనర్హత వేటు వేయించేందుకు పార్టీ తరపున తెగ ప్రయత్నాలు జరిగాయి. ఒకళ్ళపై యాక్షన్ తీసుకునేట్లు చేయటంలో చేసుకున్న ఫిర్యాదుల్లో ఇద్దరు ఫెయిలైనట్లే భావించాలి. ఒక ఎంపీ ఫెయిలవ్వటంలో ఆశ్చర్యం లేదు.
కానీ కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతు కూడా ఎంపీపై అనర్హత వేటు వేయించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి ఫెయిలైనట్లే భావించాలి. కాకపోతే నిబంధనల ప్రకారం కమిటి నడుచుకున్న కారణంగా ఎంపీ అనర్హత వేటు నుండి తప్పించుకున్నారు. మరిపుడు రఘురామ ఏమి చేస్తారో చూడాలి.
This post was last modified on June 12, 2022 6:17 pm
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…