Political News

ఏపీ మీద మమత నమ్మకం కోల్పోయారా ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం చూసిన తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. వచ్చే నెలలో జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలని మమత అనుకున్నారు. ఇందుకోసం ఈనెల 15వ తేదీన ఢిల్లీలోని కాన్సిస్టిట్యూషన్ క్లబ్ లో ప్రత్యేకించి మమత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సోనియా గాంధీతో సహా 22 పార్టీల అధినేతలకు మమత ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు.

సోనియా గాంధీ, శరద్ పవార్ కేసీయార్ లాంటి కొందరికి ప్రత్యేకించి ఫోన్లో సమావేశానికి ఆహ్వానించారు. ఇంతమందికి ఆహ్వానాలు పంపించి, కొందరికి ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడిన మమత ఏపీని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబునాయుడుకు కానీ కనీసం ఆహ్వానాలు అందలేదు. అంటే ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన మమతకు నమ్మకం ఉన్నట్లు లేదు.

మధ్యమధ్యలో పొరపొచ్చాలున్నా జగన్ అయినా చంద్రబాబు అయినా గడచిన ఎనిమిదేళ్ళుగా నరేంద్ర మోడీ లోనే ఉంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ఇపుడు జగన్ అధికారంలో ఉన్నా ఇదే పద్దతిలో వెళుతున్నారు. ఇద్దరిలో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా తమ వైఖరిని మార్చుకోవడం లేదు. దాంతో వీళ్ళిద్దరితో మాట్లాడి, చర్చించినా ఉపయోగం ఉండదని మమతకు బాగా అర్ధమైపోయినట్లుంది. అంటే వీళ్ళిద్దరినీ మమత ఎన్డీయేలో భాగంగానే చూస్తున్నట్లుంది. అందుకనే కీలకమైన సమావేశానికి ఈ ఇద్దరినీ దూరంగా పెట్టేశారు.

ఇపుడే కాదు గతంలో కూడా నరేంద్రమోడిని వ్యతిరేకించే పార్టీల అధినేతలతో మమత కొన్ని సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో కూడా జగన్, చంద్రబాబును పిలవలేదు. వీళ్ళద్దరిని కనీసం ఫోన్లో కూడా ఎవరు సంప్రదించటం లేదు. నిజంగా ఏపీలోని రాజకీయ పార్టీలకు ఒక విధంగా అవమానమనే చెప్పాలి. కానీ ఎవరు ఏమీ చేయగలిగిందేమీ లేదు ఎందుకంటే జగన్ అయినా చంద్రబాబు అయినా వాళ్ళ అవసరాల కోసం కేంద్రంపై ఆధారపడుతున్నారు. దీన్ని మోడి కూడా బాగా అలుసుగా తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారు. రాష్ట్రానికి మోడి ఇంత అన్యాయం చేస్తున్న గొంతెత్తటం లేదు కాబట్టి వీళ్ళతో మాట్లాడి ఉపయోగంలేదని చివరకు అందరు వదిలేస్తున్నారు.

This post was last modified on June 13, 2022 9:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago