Political News

గ్రూపు రాజ‌కీయాలు చేస్తే.. ఇంటికే: కేటీఆర్ క్లాస్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో ప‌ర్య‌టించిన‌ మంత్రి కేటీఆర్.. ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అసంతృప్త నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం దృష్ట్యా.. ఈ ప్రత్యేక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని నేతలకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడి జిల్లాలో టీఆర్ ఎస్‌ బలోపేతంపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. నేతల మధ్య విభేదాలు పరిష్కారం కోసం నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. టీఆర్ ఎస్‌ ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో నేతల మధ్య విభేదాలు ఉండకూడదని సూచించారు. ఖమ్మం మినహా ఇతర నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్రూప్‌ రాజకీయాలు తగదని హితవు పలికారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై కేటీఆర్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రూపు చేస్తే.. ఆ నాయ‌కుల‌ను నిర్మొహ‌మాటంగా ఇంటికి పంపుతామ‌ని హెచ్చ‌రించారు.

ఇదిలావుంటే, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ప్రతిరోజు టూరిస్ట్‌లు వస్తున్నారని ఎద్దేవాచేశారు. ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్‌ అంటున్నారని, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్లకు అధికారం ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారని, కులపిచ్చిగాళ్లు కావాలా?, అభివృద్ధి కోసం పాటుపడే టీఆర్ఎస్ కావాలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

This post was last modified on June 11, 2022 10:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

35 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago