వైసీపీ నాయకుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్పై అనర్హత పిటిషన్పై లోక్సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. సీఎం జగన్పై పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత వేటు కిందకు రాదని, పార్టీ విప్ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకి వస్తుందని స్పీకర్ ఆఫీస్ వెల్లడించింది. అంటే.. సీఎం, మంత్రులను విమర్శిస్తే అనర్హత వేటు కిందకి రాదని, రఘురామ అనర్హత పిటిషన్ ప్రివిలైజ్ కమిటీ ముందు ఉందని, విచారణ ఎప్పుడు పూర్తవుతుందో కమిటీ చెబుతుందని స్పీకర్ కార్యాలయం తెలిపింది.
అలాగే పదో షెడ్యూల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దానిపైన కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తోందని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ లోక్సభ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇచ్చిన పిటిషన్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని స్పీకర్ కోరినట్టు లోక్సభ బులెటిన్ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ గత కొంత కాలంగా స్పీకర్కు వినతిపత్రాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల రఘురామ అనర్హత పిటిషన్పై లోక్సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ నిర్వహించింది. కమిటీ ముందు ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్కుమార్ సింగ్ దీనిపై విచారణ చేపట్టారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యాకలాపా లకు పాల్పడుతున్నారని.. గతంలో స్పీకర్కు మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ పిటిషన్పై విచారణ జరిపి ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఓంబిర్లా నివేదిక పంపిన విషయం తెలిసిందే.
ఈ నివేదికలో రాజకీయ ఆరోపణలను కారణంగా చూపి అనర్హత వేటు వేయలేమని స్పీకర్ స్పష్టం చేశారు. కేవలం ఇది రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుందని.. దీనిని పార్లమెంటు నిబంధనలకు ముడి పెట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆర్ ఆర్ ఆర్పై కక్ష సాధించాలని భావించిన వైసీపీకి పెద్ద దెబ్బే తగిలినట్టు అవుతుందని అంటున్నారు పరిశృలకులు.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…