Political News

ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త‌.. స్పీక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ నాయ‌కుడు, ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌పై అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. సీఎం జగన్‌పై పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత వేటు కిందకు రాదని, పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకి వస్తుందని స్పీకర్‌ ఆఫీస్‌ వెల్లడించింది. అంటే.. సీఎం, మంత్రులను విమర్శిస్తే అనర్హత వేటు కిందకి రాదని, రఘురామ అనర్హత పిటిషన్ ప్రివిలైజ్ కమిటీ ముందు ఉందని, విచారణ ఎప్పుడు పూర్తవుతుందో కమిటీ చెబుతుందని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది.

అలాగే ప‌దో షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దానిపైన కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తోందని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ లోక్‌సభ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ ఇచ్చిన పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రివిలేజ్‌ కమిటీకి పంపించారు. ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని స్పీకర్‌ కోరినట్టు లోక్‌సభ బులెటిన్‌ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ గత కొంత కాలంగా స్పీకర్‌కు వినతిపత్రాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల రఘురామ అనర్హత పిటిషన్పై లోక్సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ నిర్వహించింది. కమిటీ ముందు ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్కుమార్ సింగ్ దీనిపై విచారణ చేపట్టారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యాకలాపా లకు పాల్పడుతున్నారని.. గతంలో స్పీకర్‌కు మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ పిటిషన్‌పై విచారణ జరిపి ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఓంబిర్లా నివేదిక పంపిన విషయం తెలిసిందే.

ఈ నివేదిక‌లో రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌ను కార‌ణంగా చూపి అన‌ర్హ‌త వేటు వేయ‌లేమ‌ని స్పీక‌ర్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ఇది రాజ‌కీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంద‌ని.. దీనిని పార్ల‌మెంటు నిబంధ‌న‌ల‌కు ముడి పెట్ట‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో ఆర్ ఆర్ ఆర్‌పై క‌క్ష సాధించాల‌ని భావించిన వైసీపీకి పెద్ద దెబ్బే త‌గిలిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశృల‌కులు.

This post was last modified on June 11, 2022 9:34 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

3 hours ago