బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజుకు పెద్ద కష్టం వచ్చింది. పార్టీలో ఆయన నాయకత్వాన్ని పెద్దగా ఎవరూ ప ట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ఎందుకంటే.. ఆయన ఎప్పుడు ఏ వ్యూహంతో ముందుకు సాగుతారో తెలియని పరిస్థితి. అదేసమయంలో ఎప్పుడు.. ఏం చెబుతారో.. ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. అందుకే.. సోముతో కలిసి ముందుకు నడిచేందుకు నాయకులు పెద్దగా ఆసక్తి చూపించరు. కాపు నాయకుడే అయినప్పటికీ.. కాపులను పార్టీ వైపు మళ్లించలేక పోయారు.
మేధావే అయినప్పటికీ.. మేధావులను పార్టీకి చేరువ చేయలేక పోయారు. ఇక, ఆర్ ఎస్ ఎస్ వాదిగా ఉన్నప్పటికీ.. హిందువుల ఓట్లను కూడా బీజేపీకి చేరువ చేయలేక పోయారు. వీటన్నింటికీ కారణం.. సోము అనుసరించే లోపభూయిష్టమైన విధానమేనని చెబుతున్నారు. ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. జనసేనను పట్టించుకుని.. అంతో ఇంతో ప్రాధాన్యం ఇస్తుందని.. అనుకున్నారు. కానీ, బీజేపీ ఎక్కడా జనసేనను పట్టించుకున్న పరిస్థితి లేదు.
పైగా.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఏపీకి వచ్చిన సందర్భంలో జనసేన నాయకులు కొందరు.. ఆయనను కలిసి.. రాష్ట్రంలో కలిసి ముందుకు వెళ్లే విధానంపై చర్చించాలని అనుకున్నారు. కానీ, సోము వీర్రాజు ఈ భేటీని అడ్డుకున్నారని.. జనసేన నాయకులను నడ్డాకు దూరంగా ఉంచారని.. బీజేపీలో జనసేన పొత్తును ఇష్టపడుతున్న నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇలా అయితే.. పార్టీ ఏం బాగుపడుతుందని.. వారు ప్రశ్నించారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే సోము అంటే..పార్టీలో ననేతలకు పెద్దగా ఇష్టం ఉండడం లేదని అంటున్నారు. తాజాగా సోము వీర్రాజుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసులను ఆయన కొట్టారని.. పరుషంగా ప్రవర్తించారని.. పోలీసులు పేర్కొన్నారు. నిజానికి ఇలాంటి పరిణామాలు వచ్చినప్పుడు.. నాయకులు మద్దతుగా వ్యవహరిస్తారు. కేసుల విషయంలో సర్కారును సైతం నిలదీస్తుంటారు. కానీ సోము విషయంలో ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. దీనిని బట్టి.. సోము పరిస్థితి నానాటికీ దిగజారుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…