Political News

మ‌రోసారి ద‌ళితుల‌కే రాష్ట్ర‌ప‌తి పీఠం రీజ‌న్ ఇదే!

దేశానికి మ‌రోసారి కూడా.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వారే రాష్ట్ర‌ప‌తి కానున్నారా? పైగా.. 2024 సార్వ‌త్రిక ఎన్నిక ల‌నేప‌థ్యంలో కీల‌క పార్టీలు తీసుకునే నిర్ణ‌యాలు అన్నీ కూడా.. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే జ‌ర‌గ‌నున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు న‌గారా మోగింది. దీంతో కీల‌క‌మైన‌.. బీజేపీ, కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగుతాయి..? ఏ విధంగా ముందుకు వెళ్తాయి? అనేది ఆస‌క్తిగా మారింది.

ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల సమయంలో బిహార్‌ గవర్నర్‌గా ఉన్న దళిత నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎంపిక చేసి అందరినీ విస్మయపరిచారు. ఆయన బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసినా.. హిందూత్వకు దూరంగానే ఉన్నారు. ఇది దళితుల ఓట్లు పెద్దఎత్తున పొందడానికి ఆ తర్వాత బీజేపీకి పలు ఎన్నికల్లో బాగా క‌లిసి వ‌చ్చింది. ఈసారీ ఇలాగే 2024 రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అభ్యర్థిని ఎంపిక చేస్తుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇక‌, ప్ర‌స్తుతం ఉన్న అవ‌కాశాల్లో ఈ దఫా గిరిజన మహిళకు అవకాశమిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తోంది. ఈమె ఒడిసాకు చెందిన బీజేపీ గిరిజన నేత. జార్ఖండ్‌ గవర్నర్‌గా 2015 మే 18 నుంచి 2021 జూలై 12 వరకు పనిచేశారు. రాష్ట్రపతిని చేసేందుకే ఆమెకు పొడిగింపు ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. ఆమెను ఎంపిక చేస్తే గిరిజన కోటాతో పాటు మహిళలకూ అవకాశం ఇచ్చినట్లవుతుందని, ఇది మోడీ స‌ర్కారును మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు త‌మ‌కు ఉప‌క‌రిస్తుంద‌ని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే అదేస‌మ‌యంలో మోడీకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు స‌హా.. కొంద‌రు కీల‌క బీజేపీ నాయ‌కులు మాత్రం ప్ర‌స్తుత రాష్ట్ర ప‌తి కోవింద్‌కు రెండో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఈయ‌న వివాదాల‌కు దూరంగా ఉండ‌డం.. అన్ని పార్టీల నుంచి కూడా సానుకూల దృక్ఫ‌థంతో ఉండ‌డం.. పైగా కోవింద్‌ను ప్ర‌క‌టిస్తే.. పోటీ కూడా త‌గ్గిపోయే అవ‌కాశం ఉండ‌డం వంటి అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఏదేమైనా రాష్ట్రపతి ఎన్నిక ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌నేది బీజేపీ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

34 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago