పనిచేయకపోతే ఒప్పుకోను..ప్రజల మధ్య ఉండకపోతే, వారి మధ్య ఉంటూ సమస్యలను తెలుసుకోకపోతే ఒప్పుకోను అంటూ జగన్ నిన్నటి వేళ పదే పదే సీరియస్ అయ్యారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం తలపెట్టి నెలరోజులు (దాదాపు) పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్నటి వేళ అమరావతిలో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే ! ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు చుక్కలు కనపడ్డాయి. ఐ ప్యాక్ టీం సీన్ లోకి వచ్చాక అన్నీ మారిపోతాయి అని ముందునుంచి అనుకున్న విధంగానే ఒక్కొ క్క నేతా పల్స్ ను వాళ్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్-తో వివరిస్తూ ముచ్చెమటలు పోయించారు.
దీంతో పాటు సీఎం చెప్పిన విధంగా కెరియర్ గ్రాఫ్ సరిగా లేని వారు, పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ సరిగా లేని వారు ఇక ఇళ్లకే పరిమితం అని చెప్పి, రానున్న ఆర్నెల్ల కాలంలో ఇంప్రూవ్ చేసుకోకపోతే ఇంటికే అని తేల్చేశారు. ఇక జీరో రిజల్ట్ ఉన్న ఎమ్మెల్యేలను బ్లాక్ లిస్టులో ఉంచుతారు. ఇప్పుడీ బ్లాక్ లిస్ట్ లో ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు చేరిపోయాయి అని నిర్థారణ అవుతోంది. ఇందులో ముఖ్యంగా శ్రీశైలం, కోవూరుతో సహా మిగతా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
ఇక బ్లాక్ లిస్టుపై చాలా మంది ఇప్పటి నుంచే బెంగ పెట్టుకుంటున్నారు.ఇది ప్రాథమిక దశ అని, గడపగడపకూ రెండో విడత తరువాత మరికొన్ని పేర్లు వచ్చి చేరుతాయి అని, క్షేత్ర స్థాయిలో తిరిగేందుకు మొహమాట పడాల్సిన అవసరమేం లేదని, వలంటీర్ల సాయంతో తిరగాల్సిన అవసరం కూడా లేదని, సమస్యలు తెలిస్తేనే గడప గడపకూ కార్యక్రమం సక్సెస్ అయిందని భావించాల్సి ఉంటుందని మంత్రులు కొందరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా శత్రువు ఇంటికి వెళ్లయినా సరే పథకాలు అమలు అవుతున్నాయో లేదో తెలుసుకుంటానని పేర్నినాని సంచలన వ్యాఖ్యలుచేశారు.
సీఎంతో జరిగిన సమావేశం తరువాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం సంచలనం అయింది. ఏదేమయినప్పటికీ ఇంట్లో ఉంటే నో ఛాన్స్.. ఇల్లిల్లూ తిరిగితేనే ఛాన్స్ అని చెప్పేశారు. ఇదొక నిరంతర ప్రక్రియ అని పనితీరు బాగుంటే కొత్త వారికి కూడా అవకాశాలు వస్తాయని నిన్నటి వేళ తేలిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు తెలివిగా వలంటీర్ల సాయంతో కార్యక్రమాన్ని చక్కబెడుతున్నారని, ఇది కరెక్టు కాదని కూడా సీఎం వ్యాఖ్యానించారని తెలుస్తోంది. సమస్యలు తెలిపినా, నిరసనలు వ్యక్తం చేసినా అవన్నీ భరించాల్సిందే అని కూడా తేల్చి చెప్పారు సీఎం. కనుక బ్లాక్ లిస్టులో ఎవరి పేరు ఎప్పుడు ఏ వేళ చేరుతుందో అంతుబట్టని విషయమేనని వైసీపీ శ్రేణులు అంటున్నారు
This post was last modified on June 9, 2022 3:14 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…