Political News

గ‌డ‌ప ఎఫెక్ట్: వైసీపీ బ్లాక్ లిస్ట్ రెడీ అయిందా!

ప‌నిచేయ‌కపోతే ఒప్పుకోను..ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌క‌పోతే, వారి మ‌ధ్య  ఉంటూ స‌మ‌స్య‌లను తెలుసుకోక‌పోతే ఒప్పుకోను అంటూ జగ‌న్ నిన్న‌టి వేళ ప‌దే ప‌దే సీరియ‌స్ అయ్యారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టి నెల‌రోజులు (దాదాపు) పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నిన్న‌టి వేళ అమ‌రావ‌తిలో వ‌ర్క్ షాప్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే ! ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి. ఐ ప్యాక్ టీం సీన్ లోకి వ‌చ్చాక అన్నీ మారిపోతాయి అని ముందునుంచి అనుకున్న విధంగానే ఒక్కొ క్క నేతా ప‌ల్స్ ను వాళ్లు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్-తో వివరిస్తూ ముచ్చెమ‌ట‌లు పోయించారు.

దీంతో పాటు సీఎం చెప్పిన విధంగా కెరియ‌ర్ గ్రాఫ్ స‌రిగా లేని వారు, పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ స‌రిగా లేని వారు ఇక ఇళ్ల‌కే ప‌రిమితం అని చెప్పి, రానున్న ఆర్నెల్ల కాలంలో ఇంప్రూవ్ చేసుకోక‌పోతే ఇంటికే అని తేల్చేశారు. ఇక జీరో రిజ‌ల్ట్ ఉన్న ఎమ్మెల్యేల‌ను బ్లాక్ లిస్టులో ఉంచుతారు. ఇప్పుడీ బ్లాక్ లిస్ట్ లో ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు చేరిపోయాయి అని నిర్థార‌ణ అవుతోంది. ఇందులో ముఖ్యంగా శ్రీ‌శైలం, కోవూరుతో స‌హా మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి.

ఇక బ్లాక్ లిస్టుపై చాలా మంది ఇప్ప‌టి నుంచే బెంగ పెట్టుకుంటున్నారు.ఇది ప్రాథ‌మిక ద‌శ అని, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ రెండో విడ‌త త‌రువాత మ‌రికొన్ని పేర్లు వ‌చ్చి చేరుతాయి అని, క్షేత్ర స్థాయిలో తిరిగేందుకు మొహ‌మాట పడాల్సిన అవ‌స‌ర‌మేం లేద‌ని, వలంటీర్ల సాయంతో తిర‌గాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని, స‌మ‌స్య‌లు తెలిస్తేనే గ‌డ‌ప గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయింద‌ని భావించాల్సి ఉంటుంద‌ని మంత్రులు కొంద‌రు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా శ‌త్రువు ఇంటికి వెళ్ల‌యినా స‌రే ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయో లేదో తెలుసుకుంటాన‌ని పేర్నినాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు.

సీఎంతో జరిగిన స‌మావేశం త‌రువాత ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నం అయింది. ఏదేమ‌యినప్ప‌టికీ ఇంట్లో ఉంటే నో ఛాన్స్.. ఇల్లిల్లూ తిరిగితేనే ఛాన్స్ అని చెప్పేశారు. ఇదొక నిరంత‌ర ప్రక్రియ అని ప‌నితీరు బాగుంటే కొత్త వారికి కూడా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని నిన్న‌టి వేళ తేలిపోయింది. కొంద‌రు ఎమ్మెల్యేలు తెలివిగా వ‌లంటీర్ల సాయంతో కార్య‌క్ర‌మాన్ని చక్క‌బెడుతున్నార‌ని, ఇది క‌రెక్టు కాద‌ని కూడా సీఎం వ్యాఖ్యానించార‌ని తెలుస్తోంది. స‌మ‌స్య‌లు తెలిపినా, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసినా అవ‌న్నీ భ‌రించాల్సిందే అని కూడా తేల్చి చెప్పారు సీఎం. క‌నుక బ్లాక్ లిస్టులో ఎవ‌రి పేరు ఎప్పుడు ఏ వేళ చేరుతుందో అంతుబ‌ట్ట‌ని విష‌య‌మేన‌ని వైసీపీ శ్రేణులు అంటున్నారు

This post was last modified on June 9, 2022 3:14 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

35 mins ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

1 hour ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

1 hour ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago