మూడేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని వివాదాలో, ఎన్ని హాట్ టాపిక్సో. తరచుగా ఏదో ఒక పెద్ద ఇష్యూ తెరపైకి రావడం, దాని మీద ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, ప్రతిపక్షాలు దాడి చేస్తుంటే ఎదురు దాడి చేయడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిన అంశం.. పదో తరగతి పరీక్ష ఫలితాలే. చాలా ఏళ్ల నుంచి 95 శాతానికి అటు ఇటుగా ఉంటున్న పాస్ పర్సంటేజ్ ఒక్కసారిగా 67 శాతానికి పడిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
దీనికి పూర్తిగా ప్రభుత్వాన్ని నిందించడానికి వీల్లేదన్నది స్పష్టం. ఎందుకంటే కరోనా కారణంగా గత రెండేళ్లూ పిల్లల చదువులు సవ్యంగా సాగలేదు. గత ఏడాది కాలంలోనూ స్కూళ్లు సరిగా నడవలేదు. క్లాసులు పూర్తి స్థాయిలో జరగలేదు. క్రమబద్ధంగా చదువుకునే అలవాటు తప్పింది. దీంతో విద్యార్థులు చదువుల్లో బలహీన పడ్డ మాట వాస్తవం. టీచర్ల వైపు నుంచి కూడా సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మేర పాస్ పర్సంటేజ్ తగ్గితే అర్థం చేసుకోవచ్చు. కానీ డ్రాప్ మరీ ఎక్కువగా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
దీని మీద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతుండటం.. ఎలా ఫెయిల్ చేస్తారని ప్రశ్నిస్తుండడమూ విడ్డూరమే. ఈ విషయంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఇదే అదనుగా జగన్ ప్రత్యర్థులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య బెండపూడి స్కూల్ విద్యార్థులు కొందరు సీఎం జగన్ను కలవడం.. వాళ్లంతా అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్లో మాట్లాడ్డం.. దాన్ని జగన్ మద్దతుదారులు వైరల్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు జరిగిపోతున్నాయని, ఇదంతా జగన్ క్రెడిటే అని కొనియాడడం తెలిసిందే. ఆ వీడియోలను పట్టుకొచ్చి ఇప్పుడు నెటిజన్లు రెచ్చిపోతున్నారు.
ఆ పిల్లల్నే తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది తప్పు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరో ట్రైన్ చేసి తీసుకొచ్చి ఈ పిల్లల్ని రాజకీయ వ్యూహంలో భాగం చేస్తే.. వాళ్లను ట్రోల్ చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. అప్పుడు కొందరు విద్యార్థులు టీచర్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ మీద పట్టు సాధించడాన్ని మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆపాదిస్తూ.. ఇదంతా జగన్ విజయం అంటూ క్రెడిట్ ఇచ్చిన వైకాపా మద్దతుదారులు మాత్రం ఇప్పుడు పాస్ పర్సంటేజ్ ఈ స్థాయిలో పడిపోవడానికి జగన్ సర్కారు బాధ్యత అని ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి. దీనికి వాళ్లేమని బదులిస్తారో?
This post was last modified on June 9, 2022 12:35 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…