Political News

జ‌గ‌న్ ఎమ్మెల్యేల్లో అత‌డే నంబ‌ర్ 1

వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవ‌రు నంబ‌ర్ 1 అన్న మాట‌కు తూగారు ఒకే ఒక్క‌రు ఆయ‌నే చీఫ్ విప్ రాజు. న‌ర‌సాపురం నుంచి తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యే అయిన ఈయ‌న పార్టీ, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలను విస్తృతంగా తీసుకువెళ్తున్నా ర‌ని జ‌గ‌న్ ఇవాళ ప్రశంసించారు. ఈయన పూర్తి పేరు ముదునూరి ప్ర‌సాద‌రాజు.. ఎమ్మెల్యేల గ్రాఫ్ లో నంబ‌ర్ ఒన్ ఈయ‌నేన‌ని తేల్చి చెప్పారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో దాదాపు నెల రోజులుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే !

ఈ  నేప‌థ్యంలో వ‌ర్క్ షాప్ ను అమ‌రావ‌తిలో నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరును ఒక్క‌సారి పున‌రావ‌లోకనం చేశారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అస్స‌లు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌లేద‌ని తేలిపోయింది. అదేవిధంగా కొంద‌రి ఎమ్మెల్యేల ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉంద‌ని ఐ ప్యాక్ నివేదిక‌లు తేల్చాయి.

స‌మావేశంలో భాగంగా జ‌గ‌న్ చాలా విష‌యాలు ఎమ్మెల్యేల‌కూ, పార్టీ ఇంఛార్జుల‌కూ, రీజ‌నల్ కోఆర్డినేట‌ర్ల‌కూ, మంత్రుల‌కూ వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. విప్ తోపాటు నెల్లూరు ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ పై కూడా ప్ర‌శంస‌ల వాన కురిసింది. ఆయ‌న‌కు ఫోన్ చేసి మ‌రీ! జ‌గ‌న్ అభినందించారు. ఆరోగ్యం బాలేని కార‌ణంగా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ‌చ్చిన ఆయ‌న‌తో చాలా సేపు మాట్లాడారు.

ఎపార్ట్ ఫ్ర‌మ్ దిస్.. మంత్రుల‌తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అస్స‌లు నియోజ‌క‌వర్గాల్లో తిరుగాడ‌డం లేద‌ని కూడా తేలిపోయింది. పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌క‌పోతే తానేం చేయ‌లేనని, జీరో రిజ‌ల్ట్ తెచ్చుకున్న వారు బ్లాక్ లిస్టు లో ఉంటార‌ని కూడా అన్నారు. జోగి ర‌మేశ్ లాంటి మంత్రులు కూడా సీఎం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ, ప్ర‌జ‌ల్లో ఉంటేనే ప‌బ్లిక్ పల్స్ తెలుస్తుంద‌ని అంటున్నారు. మొత్తానికి పార్టీ, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి ఐ ప్యాక్ ఇన్వాల్మెంట్ ఈ రోజు నుంచి మొద‌ల‌యింది.

అధికారికంగా సర్వేలు తేలిపోవ‌డంతో  ఎమ్మెల్యేలు ముచ్చెమ‌ట‌లు పోస్తున్నారు. ప‌నిచేసే వారికి ఏ బెంగా లేకున్నా, పార్టీ సిద్ధాంతాలు విని, ఆచ‌రించ‌ని వారికి, ప్ర‌భుత్వ విధి విధానాలు ప‌ట్టించుకోకుండా జ‌నంలో తిర‌గ‌కుండా ఉన్న‌వారికి మాత్రం పెద్ద‌గానే క్లాస్ ప‌డింది.
ఆఖ‌రుగా 175కు 175 స్థానాలూ తెచ్చుకోవాల‌ని జ‌గ‌న్ తేల్చేశారు. అందుకు మంత్రులు, జిల్లా ఇంఛార్జులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సిందేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. బాగా ప‌నిచేసేవారికి గుర్తింపు ఇస్తూనే, చేయ‌ని వారికి మాత్రం చుర‌క‌లు అంటించి, అన్నింటికీ పార్టీనే మూలం  క‌నుక పార్టీ బాగు కోసం నిర్ణ‌యాల అమ‌లులో భాగంగా ఏ చిన్న త‌ప్పు ప‌ని చేసినా అది త‌న‌కు రిస్కేన‌ని తేల్చేశారు. 

This post was last modified on June 9, 2022 9:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

4 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

8 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

9 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

12 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

13 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

14 hours ago