Political News

జ‌గ‌న్ ఎమ్మెల్యేల్లో అత‌డే నంబ‌ర్ 1

వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవ‌రు నంబ‌ర్ 1 అన్న మాట‌కు తూగారు ఒకే ఒక్క‌రు ఆయ‌నే చీఫ్ విప్ రాజు. న‌ర‌సాపురం నుంచి తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యే అయిన ఈయ‌న పార్టీ, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలను విస్తృతంగా తీసుకువెళ్తున్నా ర‌ని జ‌గ‌న్ ఇవాళ ప్రశంసించారు. ఈయన పూర్తి పేరు ముదునూరి ప్ర‌సాద‌రాజు.. ఎమ్మెల్యేల గ్రాఫ్ లో నంబ‌ర్ ఒన్ ఈయ‌నేన‌ని తేల్చి చెప్పారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో దాదాపు నెల రోజులుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే !

ఈ  నేప‌థ్యంలో వ‌ర్క్ షాప్ ను అమ‌రావ‌తిలో నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరును ఒక్క‌సారి పున‌రావ‌లోకనం చేశారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అస్స‌లు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌లేద‌ని తేలిపోయింది. అదేవిధంగా కొంద‌రి ఎమ్మెల్యేల ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉంద‌ని ఐ ప్యాక్ నివేదిక‌లు తేల్చాయి.

స‌మావేశంలో భాగంగా జ‌గ‌న్ చాలా విష‌యాలు ఎమ్మెల్యేల‌కూ, పార్టీ ఇంఛార్జుల‌కూ, రీజ‌నల్ కోఆర్డినేట‌ర్ల‌కూ, మంత్రుల‌కూ వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. విప్ తోపాటు నెల్లూరు ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ పై కూడా ప్ర‌శంస‌ల వాన కురిసింది. ఆయ‌న‌కు ఫోన్ చేసి మ‌రీ! జ‌గ‌న్ అభినందించారు. ఆరోగ్యం బాలేని కార‌ణంగా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ‌చ్చిన ఆయ‌న‌తో చాలా సేపు మాట్లాడారు.

ఎపార్ట్ ఫ్ర‌మ్ దిస్.. మంత్రుల‌తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అస్స‌లు నియోజ‌క‌వర్గాల్లో తిరుగాడ‌డం లేద‌ని కూడా తేలిపోయింది. పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌క‌పోతే తానేం చేయ‌లేనని, జీరో రిజ‌ల్ట్ తెచ్చుకున్న వారు బ్లాక్ లిస్టు లో ఉంటార‌ని కూడా అన్నారు. జోగి ర‌మేశ్ లాంటి మంత్రులు కూడా సీఎం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ, ప్ర‌జ‌ల్లో ఉంటేనే ప‌బ్లిక్ పల్స్ తెలుస్తుంద‌ని అంటున్నారు. మొత్తానికి పార్టీ, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి ఐ ప్యాక్ ఇన్వాల్మెంట్ ఈ రోజు నుంచి మొద‌ల‌యింది.

అధికారికంగా సర్వేలు తేలిపోవ‌డంతో  ఎమ్మెల్యేలు ముచ్చెమ‌ట‌లు పోస్తున్నారు. ప‌నిచేసే వారికి ఏ బెంగా లేకున్నా, పార్టీ సిద్ధాంతాలు విని, ఆచ‌రించ‌ని వారికి, ప్ర‌భుత్వ విధి విధానాలు ప‌ట్టించుకోకుండా జ‌నంలో తిర‌గ‌కుండా ఉన్న‌వారికి మాత్రం పెద్ద‌గానే క్లాస్ ప‌డింది.
ఆఖ‌రుగా 175కు 175 స్థానాలూ తెచ్చుకోవాల‌ని జ‌గ‌న్ తేల్చేశారు. అందుకు మంత్రులు, జిల్లా ఇంఛార్జులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సిందేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. బాగా ప‌నిచేసేవారికి గుర్తింపు ఇస్తూనే, చేయ‌ని వారికి మాత్రం చుర‌క‌లు అంటించి, అన్నింటికీ పార్టీనే మూలం  క‌నుక పార్టీ బాగు కోసం నిర్ణ‌యాల అమ‌లులో భాగంగా ఏ చిన్న త‌ప్పు ప‌ని చేసినా అది త‌న‌కు రిస్కేన‌ని తేల్చేశారు. 

This post was last modified on June 9, 2022 9:29 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

17 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

27 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

47 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago