వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు నంబర్ 1 అన్న మాటకు తూగారు ఒకే ఒక్కరు ఆయనే చీఫ్ విప్ రాజు. నరసాపురం నుంచి తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యే అయిన ఈయన పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను విస్తృతంగా తీసుకువెళ్తున్నా రని జగన్ ఇవాళ ప్రశంసించారు. ఈయన పూర్తి పేరు ముదునూరి ప్రసాదరాజు.. ఎమ్మెల్యేల గ్రాఫ్ లో నంబర్ ఒన్ ఈయనేనని తేల్చి చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దాదాపు నెల రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే !
ఈ నేపథ్యంలో వర్క్ షాప్ ను అమరావతిలో నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేల పనితీరును ఒక్కసారి పునరావలోకనం చేశారు. ఏడు నియోజకవర్గాల్లో అస్సలు గడపగడపకూ కార్యక్రమం నిర్వహించలేదని తేలిపోయింది. అదేవిధంగా కొందరి ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా ఉందని ఐ ప్యాక్ నివేదికలు తేల్చాయి.
సమావేశంలో భాగంగా జగన్ చాలా విషయాలు ఎమ్మెల్యేలకూ, పార్టీ ఇంఛార్జులకూ, రీజనల్ కోఆర్డినేటర్లకూ, మంత్రులకూ వివరించే ప్రయత్నం చేశారు. విప్ తోపాటు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ పై కూడా ప్రశంసల వాన కురిసింది. ఆయనకు ఫోన్ చేసి మరీ! జగన్ అభినందించారు. ఆరోగ్యం బాలేని కారణంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వచ్చిన ఆయనతో చాలా సేపు మాట్లాడారు.
ఎపార్ట్ ఫ్రమ్ దిస్.. మంత్రులతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అస్సలు నియోజకవర్గాల్లో తిరుగాడడం లేదని కూడా తేలిపోయింది. పార్టీ నాయకులు ప్రజల మధ్య ఉండకపోతే తానేం చేయలేనని, జీరో రిజల్ట్ తెచ్చుకున్న వారు బ్లాక్ లిస్టు లో ఉంటారని కూడా అన్నారు. జోగి రమేశ్ లాంటి మంత్రులు కూడా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రజల్లో ఉంటేనే పబ్లిక్ పల్స్ తెలుస్తుందని అంటున్నారు. మొత్తానికి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఐ ప్యాక్ ఇన్వాల్మెంట్ ఈ రోజు నుంచి మొదలయింది.
అధికారికంగా సర్వేలు తేలిపోవడంతో ఎమ్మెల్యేలు ముచ్చెమటలు పోస్తున్నారు. పనిచేసే వారికి ఏ బెంగా లేకున్నా, పార్టీ సిద్ధాంతాలు విని, ఆచరించని వారికి, ప్రభుత్వ విధి విధానాలు పట్టించుకోకుండా జనంలో తిరగకుండా ఉన్నవారికి మాత్రం పెద్దగానే క్లాస్ పడింది.
ఆఖరుగా 175కు 175 స్థానాలూ తెచ్చుకోవాలని జగన్ తేల్చేశారు. అందుకు మంత్రులు, జిల్లా ఇంఛార్జులు సమన్వయంతో పనిచేయాల్సిందేనని కుండ బద్దలు కొట్టేశారు. బాగా పనిచేసేవారికి గుర్తింపు ఇస్తూనే, చేయని వారికి మాత్రం చురకలు అంటించి, అన్నింటికీ పార్టీనే మూలం కనుక పార్టీ బాగు కోసం నిర్ణయాల అమలులో భాగంగా ఏ చిన్న తప్పు పని చేసినా అది తనకు రిస్కేనని తేల్చేశారు.
This post was last modified on June 9, 2022 9:29 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో…
రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…