ఏపీ బీజేపీ విషయంలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. సీఎంను నిర్ణయించేది ఎవరు? అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై ఇప్పుడే మాట్లాడొద్దని.. పార్టీ జాతీయ అధ్యక్షులు.. జేపీ నడ్డా తేల్చి చెప్పారు. కానీ, ఇదేసమయంలో బీజేపీలోనే ఉన్న కొందరు నాయకులు ఇప్పటికే మనం.. జనసేనతో పొత్తులో ఉన్నాం కాబట్టి.. ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే.. పార్టీలో మరింత ఊపు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ, నడ్డా మాత్రం షరతులకు బీజేపీ లొంగదని.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తాము చేసిందే నిర్ణయమని.. పార్టీ నియోజకవర్గ స్థాయి శక్తి కేంద్రాల భేటీలో వ్యాఖ్యానించారు. నిజానికి పొత్తులో ఉన్న పార్టీలు ఏవైనా.. సీఎం అభ్యర్థిని ఎలా నిర్ణయిస్తాయి? ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఎన్నికల్లో ఏ పార్టీ అయితే.. ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే.. ఆ పార్టీకే సీఎం అభ్యర్థి పోస్టు దక్కుతోంది.
ఒకవేళ బీజేపీ పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా బీజేపీ కి ఎక్కువ సీట్లు వచ్చి జనసేనకు తక్కువ సీట్లు వస్తే… మాట మార్చేస్తుంది.
ఎందుకంటే ఎక్కువ సీట్లు ఉన్నవారు ఆబ్వియస్ గా సీఎం అవుతారు. చేతిలో సీట్లు ఉంటే ఎవరో ఎవరినో సీఎం చేయాల్సిన అవసరం లేదు. కదా. పవన్ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ విషయం నడ్డాకు తెలియంది కాదు. అయినప్పటికీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని తామే నిర్ణయిస్తామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం.. అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఒక్కశాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ.. ముందు ఓటు బ్యాంకు పుంజుకునే విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే.. దీనిని పక్కన పెట్టిన పార్టీ.. అధికారంలోకి వచ్చేస్తామని.. ముఖ్యమంత్రి అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని ప్రకటించడం.. వంటివి రాజకీయాల్లో చిత్రంగా అనిపిస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీకి ఒక్క సీటు కూడా ప్రాతినిధ్యం కనిపించడం లేదు. కనీసం బైపోల్స్లో కూడా ఆశించిన విధంగా పార్టీ పుంజుకున్నది కూడా లేదు. మూడేళ్లలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా పుంజుకోలేదు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆశించిన దూకుడు చూపించలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉట్టికే ఎగరలే ని పరిస్థితి ఉంటే.. ముఖ్యమంత్రిని నిర్ణయించే స్థాయిలో ఉన్నామని చెప్పుకోవడం.. వాపును చూసి బలుపు అనుకోవడం.. ఏమేరకు సమంజసమనేది ప్రశ్న. ఏదేమైనా.. ప్రజల తీర్పు నిర్ణయించే ముఖ్యమంత్రి పీఠాన్ని వీరు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం.. విమర్శలకు తావిస్తుండడం గమనార్హం.
This post was last modified on June 8, 2022 7:28 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…