ఆంధ్రావనిలో విభిన్న రాజకీయ వాతావరణమే నెలకొని ఉంది. ఎన్నికలకు రెండేళ్ల దూరం ఉండగానే ప్రముఖ పార్టీల నాయకులు వేదికలపై విభిన్న ధోరణుల్లో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవడంలోనే విజ్ఞత ఉంది. వాస్తవానికి ఎన్నికల వేళ చెప్పాల్సిన మాటలే ఇవి కానీ ముందుగానే అప్పగిస్తున్నారు. ఎన్నికల వేళ చేయాల్సిన పనులే ఇవి కానీ ముందుగానే రాజకీయ రాద్ధాంతాలు చేస్తున్నారు. వీటి కారణంగా అస్థిరత ఒకటి ఏర్పడడం ఖాయం.
పొత్తులవిషయమై కానీ పథకాల విషయమై కానీ వేటిపై మాట్లాడినా అవన్నీ రాజకీయంలో భాగమే కానీ మరీ ఇంత ముందస్తుగా మాట్లాడాల్సిన పని అయితే లేదు. అవును ! బీజేపీ ఇప్పుడిక ఏపీలో నిలదొక్కుకోవాలని యోచిస్తోంది. ఆ క్రమంలో తనదైన రాజకీయం నెరవేర్పునకు బాటలు వేస్తోంది. తెలంగాణ మరియు ఆంధ్రాలో ఏక కాలంలో బీజేపీ పాలక పార్టీలతో కయ్యాలకు కాలు దువ్వుతోంది. వీటి కారణంగా రాజకీయ అస్థిరత అయితే ఏర్పడదు కానీ పాలన సంబంధ పనుల్లో కాస్త గందరగోళం నెలకొనక తప్పదు.
ఇప్పటికే బీజేపీ బాస్ జేపీ నడ్డా రెండ్రోజుల పర్యటనలో భాగంగా చాలా మాటలు చెప్పారు. అవి నిరూపణలో ఉన్నాయా లేదా అన్నది అటుంచితే, వీటి ప్రభావం ప్రజలపై పడక తప్పదు. గోదావరి తీరాన ఆయన ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని అన్నారు. బీజేపీ గెలుపు తథ్యం అని కూడా అన్నారు. ఈ రెండూ సాధ్యమా ఓ సారి చూద్దాం. ముఖ్యంగా వైసీపీ కొన్ని తప్పిదాలు పాలనపరంగా చేసినా కూడా ప్రతిపక్షాలు చెప్పినంతగా ప్రజాభిమానం ఏమీ కోల్పోయి లేదు. అదేవిధంగా బీజేపీకి అధికారం ఇచ్చేంతగా పాలక పార్టీ తప్పిదాలు ఏమీ లేవు.
అయినా ఆంధ్రా అభివృద్ధికి కీలకం అనుకునే ఏ ఒక్క విషయంలో కూడా సహకరించని లేదా నిధులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వని ఓ జాతీయ పార్టీని
ఈ ప్రాంత ఓటర్లు ఎలా నమ్ముతారు అని ! వైసీపీ ఓటమి అయితే సాధ్యం అవుతుందో లేదో కానీ బీజేపీ ఒంటరిపోరులో భాగంగా గెలుపు అయితే సాధ్యం కాదు. ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నా ఏ ఉద్దేశంలో భాగంగా అన్నా కూడా క్షేత్ర స్థాయిలో సరైన కార్యవర్గం కూడా లేని బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారం కోసం కలలు కనడం మాత్రం పెద్దగా భావ్యంగా లేదు. కలలు ఎవరైనా కనొచ్చు కానీ సాధ్యం అయిన రీతిలోనే కలలు కంటే మంచి ఫలితాలు వాటికి అనుగుణంగా పాలక ప్రభుత్వాలు ఏర్పాటు కావడం అన్నది తథ్యం.
This post was last modified on June 8, 2022 5:44 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…