ఆంధ్రావనిలో విభిన్న రాజకీయ వాతావరణమే నెలకొని ఉంది. ఎన్నికలకు రెండేళ్ల దూరం ఉండగానే ప్రముఖ పార్టీల నాయకులు వేదికలపై విభిన్న ధోరణుల్లో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవడంలోనే విజ్ఞత ఉంది. వాస్తవానికి ఎన్నికల వేళ చెప్పాల్సిన మాటలే ఇవి కానీ ముందుగానే అప్పగిస్తున్నారు. ఎన్నికల వేళ చేయాల్సిన పనులే ఇవి కానీ ముందుగానే రాజకీయ రాద్ధాంతాలు చేస్తున్నారు. వీటి కారణంగా అస్థిరత ఒకటి ఏర్పడడం ఖాయం.
పొత్తులవిషయమై కానీ పథకాల విషయమై కానీ వేటిపై మాట్లాడినా అవన్నీ రాజకీయంలో భాగమే కానీ మరీ ఇంత ముందస్తుగా మాట్లాడాల్సిన పని అయితే లేదు. అవును ! బీజేపీ ఇప్పుడిక ఏపీలో నిలదొక్కుకోవాలని యోచిస్తోంది. ఆ క్రమంలో తనదైన రాజకీయం నెరవేర్పునకు బాటలు వేస్తోంది. తెలంగాణ మరియు ఆంధ్రాలో ఏక కాలంలో బీజేపీ పాలక పార్టీలతో కయ్యాలకు కాలు దువ్వుతోంది. వీటి కారణంగా రాజకీయ అస్థిరత అయితే ఏర్పడదు కానీ పాలన సంబంధ పనుల్లో కాస్త గందరగోళం నెలకొనక తప్పదు.
ఇప్పటికే బీజేపీ బాస్ జేపీ నడ్డా రెండ్రోజుల పర్యటనలో భాగంగా చాలా మాటలు చెప్పారు. అవి నిరూపణలో ఉన్నాయా లేదా అన్నది అటుంచితే, వీటి ప్రభావం ప్రజలపై పడక తప్పదు. గోదావరి తీరాన ఆయన ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని అన్నారు. బీజేపీ గెలుపు తథ్యం అని కూడా అన్నారు. ఈ రెండూ సాధ్యమా ఓ సారి చూద్దాం. ముఖ్యంగా వైసీపీ కొన్ని తప్పిదాలు పాలనపరంగా చేసినా కూడా ప్రతిపక్షాలు చెప్పినంతగా ప్రజాభిమానం ఏమీ కోల్పోయి లేదు. అదేవిధంగా బీజేపీకి అధికారం ఇచ్చేంతగా పాలక పార్టీ తప్పిదాలు ఏమీ లేవు.
అయినా ఆంధ్రా అభివృద్ధికి కీలకం అనుకునే ఏ ఒక్క విషయంలో కూడా సహకరించని లేదా నిధులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వని ఓ జాతీయ పార్టీని
ఈ ప్రాంత ఓటర్లు ఎలా నమ్ముతారు అని ! వైసీపీ ఓటమి అయితే సాధ్యం అవుతుందో లేదో కానీ బీజేపీ ఒంటరిపోరులో భాగంగా గెలుపు అయితే సాధ్యం కాదు. ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నా ఏ ఉద్దేశంలో భాగంగా అన్నా కూడా క్షేత్ర స్థాయిలో సరైన కార్యవర్గం కూడా లేని బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారం కోసం కలలు కనడం మాత్రం పెద్దగా భావ్యంగా లేదు. కలలు ఎవరైనా కనొచ్చు కానీ సాధ్యం అయిన రీతిలోనే కలలు కంటే మంచి ఫలితాలు వాటికి అనుగుణంగా పాలక ప్రభుత్వాలు ఏర్పాటు కావడం అన్నది తథ్యం.
This post was last modified on June 8, 2022 5:44 pm
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…