Political News

క‌ర్ణాట‌క‌ను కుదిపేస్తున్న `చెడ్డీ` రాజ‌కీయం

ఆర్‌ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్‌ కార్యాలయానికి పంపుతున్నారు. ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. కర్ణాటకలో ఓ చిత్ర‌మైన వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అదే చెడ్డీ వివాదం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (ఆర్‌ఎస్ఎస్‌)కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది.

దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్‌ కార్యాలయానికి పంపుతుండటం గమనార్హం. విద్యను కాషాయీకరణం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్‌ ఇంటి బయట ఖాకీ నిక్కర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు పోలీసుల ఎదుట చెడ్డీలను కాల్చారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా మేం ఎక్కడైనా కాలుస్తాం’ అని పేర్కొన్నారు.

మాజీ సీఎం వ్యాఖ్యలు కాస్తా వివాదానికి దారితీశాయి. బీజేపీ నేత చలవాడి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఆయన ఈ స్థాయికి దిగజారుతారని ఊహించలేదని పేర్కొన్నారు. ‘సిద్ధరామయ్య చెడ్డీలు కాల్చాలనుకుంటే ఆయన ఇంట్లో వాటిని కాల్చుకోనీయండి. సిద్దరామయ్యకు చడ్డీలు పంపి సహాయం చేయమని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులకు తెలియజేశాను.

చడ్డీలను కాల్చడం వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నాను. సిద్ధరామయ్య ఈ స్థాయికి దిగజారిపోతారని అనుకోలే దు’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. సిద్ధరామయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిక్కర్‌ పార్సిళ్లను పంపుతున్నారు.

This post was last modified on June 7, 2022 7:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

4 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

8 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

9 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

12 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

13 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

14 hours ago