ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్ కార్యాలయానికి పంపుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలో ఓ చిత్రమైన వివాదం తెరమీదికి వచ్చింది. అదే చెడ్డీ వివాదం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది.
దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్ కార్యాలయానికి పంపుతుండటం గమనార్హం. విద్యను కాషాయీకరణం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ ఇంటి బయట ఖాకీ నిక్కర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ఎన్ఎస్యూఐ సభ్యులు పోలీసుల ఎదుట చెడ్డీలను కాల్చారు. కానీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా మేం ఎక్కడైనా కాలుస్తాం’ అని పేర్కొన్నారు.
మాజీ సీఎం వ్యాఖ్యలు కాస్తా వివాదానికి దారితీశాయి. బీజేపీ నేత చలవాడి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఆయన ఈ స్థాయికి దిగజారుతారని ఊహించలేదని పేర్కొన్నారు. ‘సిద్ధరామయ్య చెడ్డీలు కాల్చాలనుకుంటే ఆయన ఇంట్లో వాటిని కాల్చుకోనీయండి. సిద్దరామయ్యకు చడ్డీలు పంపి సహాయం చేయమని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులకు తెలియజేశాను.
చడ్డీలను కాల్చడం వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నాను. సిద్ధరామయ్య ఈ స్థాయికి దిగజారిపోతారని అనుకోలే దు’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. సిద్ధరామయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిక్కర్ పార్సిళ్లను పంపుతున్నారు.
This post was last modified on June 7, 2022 7:51 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…