కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి మృతదేహాలను ఎవరూ తాకవద్దు. మృతదేహాల నుండి కరోనా మరింతగా వ్యాప్తిస్తుందని తేలింది. కనీసం అయినవారు కూడా ముట్టుకోలేని దారుణ పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారిని తీసుకెళ్లి ఖననం చేస్తోన్న విధానం అందరినీ కదిలిస్తోంది. ఎలాగూ చనిపోయాడు. పైగా ముట్టుకోవద్దు. కానీ ఖననం కోసం జాగ్రత్తలు తీసుకొని వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కనికరం చూపని ఘటనలు బయటపడుతున్నాయి.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మనసును కదిలించే ఘటన చోటు చేసుకుంది. పలాస మున్సిపాలిటీలోని ఉదయపురానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో ఉద్యోగి. ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. పరీక్షల్లో కరోనా లక్షణాలతో చనిపోయినట్లు తేలింది. దీంతో అక్కడున్న జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు నిరాకరించారట. వైద్యులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పీపీఈ కిట్స్ ధరించి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు… మృతదేహాన్ని జేసీబీ వాహనంలో తరలించి, అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మృతుడి కుమారుడు స్పందిస్తూ.. అసలు తన తండ్రి చనిపోయింది బ్రెయిన్ స్ట్రోక్తో అని, కరోనా లక్షణాలు లేవని, అధికారులే హడావుడి చేసి అంత్యక్రియలకు ఆటంకం కలిగించారని చెబుతున్నాడట. కాగా, ఈ ఘటనకు సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు.
This post was last modified on June 26, 2020 8:44 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…