Political News

రాత్రి పబ్‌జీ గేమ్ ఆడి పొద్దున్నే సైకోలా: జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు

దేశంలో డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వైయస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం మండిపడ్డారు. ఎక్కడ చూసినా విధ్వంసం బాగా ఉందని, అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. జగన్ రాత్రి పబ్‌జీ గేమ్ ఆడుతారని, పొద్దున్నే సైకోలా ప్రజలపై పడతారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు కుటుంబాన్ని కలిసి పరామర్శించిన అనంతరం లోకేష్ మాట్లాడారు.

సంక్షేమం, అభివృద్ధి కోసం వైసీపీని ప్రజలు గెలిపించారని, జగన్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీపై కక్ష కట్టారని, తమ నాయకులు, కార్యకర్తలు, బడుగుబలహీన వర్గాల ప్రజలపై పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మద్యం, ఇసుక, 108 అంబులెన్స్ వంటి వాటిల్లో వైసీపీ నేతల అవినీతికి అంతు లేదన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కూన రవికుమార్ కేసు పెట్టారని, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పెళ్లికి వెళ్తే కేసులు పెట్టారని, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారని, ఇంతకంటే దారుణం లేదని అభిప్రాయపడ్డారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడికి ఎలాంటి పాత్ర లేదన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న, పోరాడుతున్న వారిని జైలుకు పంపించి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మాట్లాడినందుకు ఓ వృద్ధురాలిపై కూడా కేసు పెట్టారన్నారు.

This post was last modified on June 26, 2020 8:09 pm

Share
Show comments
Published by
suman
Tags: Nara Lokesh

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

16 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

35 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago