Political News

జైల్లో తోటి ఖైదీపై దాడి చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు

దారుణ నేరానికి పాల్పడి.. ఏపీ అధికారపక్షానికి భారీ డ్యామేజ్ ను చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మరో ‘ఘనకార్యానికి’ పాల్పడినట్లుగా చెబుతున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అతను ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తోటి ఖైదీ తో గొడవ పడిన ఎమ్మెల్సీ.. అతడిపై దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఏదో విషయం మీద ఇద్దరికి మధ్య మాటా మాటా పెరిగిందని.. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చేయి చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయని చెబుతున్నారు. జైలుకు వెళ్లిన రెండు రోజులకే పరుపు ఏర్పాటు చేశారని.. ఆయన కోరిన ఆహారాన్ని బయట నుంచి అందుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్సీని బాగా చూసుకోవాలని జైలు అధికారులకు ‘పెద్ద’ స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే.. ఒక జైలు గదిలో ముగ్గురు ఖైదీల్ని ఉంచాల్సి ఉంటుంది.

కానీ..ఎమ్మెల్సీ అనంత బాబుకు మాత్రం అందుకు భిన్నంగా ఒక్కడినే ఒక గదిలో ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే.. తాజాగా బయటకు వచ్చిన సందర్భంలోనే తోటి ఖైదీతో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. జైల్లో అనంతబాబు చేసిన దాడిలో ఎదుటి ఖైదీకి దెబ్బలు తగలకపోవటంతో అతన్ని ఆసుపత్రికి చేర్చలేదని చెబుతున్నారు. నిబంధనలకు భిన్నంగా జైల్లో ఉన్న అనంతబాబును పలువురు ప్రజాప్రతినిధులు పదే పదే కలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలు సరిపోనట్లుగా.. తాజాగా తోటి ఖైదీపై దాడి చేసిన వైనం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

This post was last modified on June 4, 2022 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సైలెంట్ అయితే ఎలా సామ్

సమంత టైటిల్ రోల్ పోషించిన మా ఇంటి బంగారం మే 15 రావడం లేదని ఫిలిం నగర్ టాక్. వాయిదా…

1 hour ago

పోరాట యోధుడిగా సల్మాన్ సర్ప్రైజ్

ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…

5 hours ago

హోటళ్లకు బండ బాదుడే

దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…

6 hours ago

సాయిపల్లవిని చూడ్డానికి కూడా రారా?

ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…

8 hours ago

ఎన్టీఆర్ కోసం కథ మార్చిన ప్రశాంత్ నీల్

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…

9 hours ago

సుకుమార్ ఎంత సమయం తీసుకుంటారో

కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…

14 hours ago