Political News

జైల్లో తోటి ఖైదీపై దాడి చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు

దారుణ నేరానికి పాల్పడి.. ఏపీ అధికారపక్షానికి భారీ డ్యామేజ్ ను చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మరో ‘ఘనకార్యానికి’ పాల్పడినట్లుగా చెబుతున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అతను ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తోటి ఖైదీ తో గొడవ పడిన ఎమ్మెల్సీ.. అతడిపై దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఏదో విషయం మీద ఇద్దరికి మధ్య మాటా మాటా పెరిగిందని.. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చేయి చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయని చెబుతున్నారు. జైలుకు వెళ్లిన రెండు రోజులకే పరుపు ఏర్పాటు చేశారని.. ఆయన కోరిన ఆహారాన్ని బయట నుంచి అందుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్సీని బాగా చూసుకోవాలని జైలు అధికారులకు ‘పెద్ద’ స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే.. ఒక జైలు గదిలో ముగ్గురు ఖైదీల్ని ఉంచాల్సి ఉంటుంది.

కానీ..ఎమ్మెల్సీ అనంత బాబుకు మాత్రం అందుకు భిన్నంగా ఒక్కడినే ఒక గదిలో ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే.. తాజాగా బయటకు వచ్చిన సందర్భంలోనే తోటి ఖైదీతో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. జైల్లో అనంతబాబు చేసిన దాడిలో ఎదుటి ఖైదీకి దెబ్బలు తగలకపోవటంతో అతన్ని ఆసుపత్రికి చేర్చలేదని చెబుతున్నారు. నిబంధనలకు భిన్నంగా జైల్లో ఉన్న అనంతబాబును పలువురు ప్రజాప్రతినిధులు పదే పదే కలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలు సరిపోనట్లుగా.. తాజాగా తోటి ఖైదీపై దాడి చేసిన వైనం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

This post was last modified on June 4, 2022 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago