Political News

బీజేపీతో పవన్ కు గ్యాప్ వచ్చేసిందా ?

మిత్రపక్షంతో పవన్ కు గ్యాప్ వచ్చేసిందా? అవుననే అనిపిస్తోంది తాజా వ్యాఖ్యలను విన్న తర్వాత. మిత్రపక్షం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ మాత్రం ఇష్టపడటంలేదు. ఆ విషయం పవన్ మాటల్లో స్పష్టంగా తెలిసిపోయింది. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం వస్తున్న నడ్డాను కలిసే ఆలోచన లేదని పవన్ చెప్పటమే దీనికి నిదర్శనం. ఒకపుడు ఇదే నడ్డాను కలవటానికి పవన్ ఏకంగా ఢిల్లీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.

నడ్డాను కలవటానికి ఢిల్లీకి వెళ్ళిన పవన్ అదే నడ్డా ఇపుడు రాష్ట్రానికి వస్తుంటే కలిసే ఆలోచన లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత బీజేపీతో జనసేనకు గ్యాప్ మొదలైందని అర్దమైపోతోంది. పైగా తనకున్న సంబంధాలన్నీ ఢిల్లీ బీజేపీ నేతలతోనే తప్ప ఏపీ బీజేపీ నేతలతో కాదని స్పష్టంగా ప్రకటించారు. జాతీయ పార్టీకి చెందిన రాష్ట్రంలోని నేతలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించటమే విచిత్రంగా ఉంది.

పార్టీ ఆవిర్భావ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడినపుడు బీజేపీ పెద్దల నుండి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇపుడేమో బీజేపీ నుంచి జనసేన ఎలాంటి రోడ్ మ్యాప్ తీసుకోలేదని ప్రకటించారు. తీసుకోలేదంటే రోడ్ మ్యాప్ వాళ్ళివ్వలేదా ? లేకపోతే వాళ్ళిచ్చిన రోడ్ మ్యాప్ నచ్చక పవనే తీసుకోలేదా ? లేకపోతే అసలు రోడ్ మ్యాపే ఇవ్వమని బీజేపీ చెప్పిందా ? అనే ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెప్పాలి.

This post was last modified on June 4, 2022 11:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago