సమైక్య రాష్ట్రంలో కేసీయార్ వెన్నుపోటుకు ప్రయత్నించారా ? మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఏ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణా ఉద్యమంలో అమరవీరుల స్మృత్యర్ధం ఓ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే చంద్రబాబునాయుడును దింపేసి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీయార్ ప్రయత్నించినట్లు చెప్పారు. కేసీయార్ కున్నంత అధికార దాహం ప్రపంచంలో మరే నేతకు లేదన్నారు.
కేసీయార్ చేసిన ప్రయత్నాలు చివరి నిముషంలో చంద్రబాబుకు తెలియటంతోనే జాగ్రత్త పడినట్లు చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లోనే కేసీయార్ టీడీపీని వదిలేసి బయటకు వెళ్ళిపోయినట్లు తెలిపారు. చంద్రబాబు మొదటసారి ముఖ్యమంత్రయినపుడు తాను, కేసీయార్ ఇద్దరం మంత్రులుగా పనిచేసిన విషయాన్ని చంద్రశేఖర్ గుర్తుచేశారు. పదవుల కోసం కుట్రలు చేయటం కేసీయార్ కు మొదటి నుండి వచ్చిన అలవాటే అంటు మండిపడ్డారు.
అప్పట్లో టీడీపీ ఎంఎల్ఏల్లో 60 మందిని చీల్చేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేయటానికి కేసీయార్ ప్రయత్నించినట్లు చెప్పారు. అయితే 61వ ఎంఎల్ఏగా తమతో చేరిన జ్యోతుల నెహ్రు చివరి నిముషంలో ఈ కుట్ర విషయాన్ని చెప్పటంతో చంద్రబాబు జాగ్రత్త పడినట్లు గుర్తుచేశారు. తనతో పాటు కేసీయార్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అందరం చంద్రబాబుకు వ్యతిరేకంగా కలిసినట్లు అంగీకరించారు. 60 మంది ఎంఎల్ఏలు జమవ్వగానే అందరం కలిసి గవర్నర్ దగ్గరకు వెళ్ళి చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కేసీయార్ రెడీ అయినట్లు కూడా చెప్పారు.
తర్వాత జరిగిన పరిణామాల్లో తెలంగాణా ఉద్యమంలో తనను ముఖ్యమంత్రి ని చేస్తానని కేసీయార్ ఎన్నో సార్లు హామీ ఇచ్చినట్లు చంద్రశేఖర్ చెప్పారు. అలాగే మధుసూదనాచారి లాంటి వాళ్ళని మంత్రులను చేస్తానని మండిపడ్డారు. నోటికొచ్చినట్లుగా హామీలిచ్చేయటం తర్వాత వాటిని గాలికొదిలేయటం కేసీయార్ కు అలవాటే అని చెప్పటానికే పాత విషయాలను చంద్రశేఖర్ ప్రస్తావించారు. ఏదేమైనా ఎప్పుడో జరిగిన రాజకీయ పరిణామాలను చంద్రశేఖర్ ఇపుడు బయట పెట్టడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ మాజీ మంత్రి చెప్పేంతవరకు అప్పట్లో కేసీయార్ చేసిన ప్రయత్నాలు ఎవరికీ తెలీకపోవటం విచిత్రంగానే ఉంది.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…