Political News

మూడేళ్ళల్లో రాజధాని నిర్మిస్తారట

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటలు కోటలు దాటిపోతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మూడేళ్ళల్లో అమరావతి రాజధానిని నిర్మించేస్తామన్నారు. మొదటి సంతకం రాజధాని నిర్మాణంపైనే పెడతారట. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేవలం అమరావతి నిర్మాణానికి మాత్రమే రు. 10 వేల కోట్లు తెప్పిస్తామన్నారు. తాజాగా వీర్రాజు మాటలు చూసిన తర్వాత మాటలు కోటలు దాటుతున్నాయనే సామెత గుర్తురాకమానదు.

ఎందుకంటే మూగవాడు అమ్మా అనేదెప్పుడనే సామెతలాగ బీజేపీ అధికారంలోకి వచ్చేదెపుడు ? అమరావతి రాజధానిని నిర్మించేదెపుడు ? రాజధాని నిర్మాణాన్ని పక్కనపెట్టేస్తే అసలు ఎన్నికల్లో పోటీచేయటానికి 175 నియోజకవర్గాల్లోను బీజేపీకి అభ్యర్ధులున్నారన్నా అన్నదే అసలైన పాయింట్. ఎందుకంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేయటానికే పార్టీకి అభ్యర్ధి దొరకటంలేదు.

ఆత్మకూరులో ఉపఎన్నిక జరుగుతుందని అందరికీ ఎప్పుడో తెలుసు. అయినా ఇప్పటివరకు ఇక్కడినుండి పోటీచేయటానికి ఒక అభ్యర్ధిని రెడీచేసుకోలేకపోయారు. ఆత్మకూరులో పోటీచేయటానికి సీనియర్లు ఎవరు ముందుకు రావటంలేదు. బిజివేముల రవీంద్రనాద్ అనే కొత్తనేత ముందుకొచ్చినా సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అంటే సీనియర్లు ముందుకు రావటంలేదు, కొత్తగా చేరిన వారికి టికెట్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పరిస్ధితి ఇక్కడ విచిత్రంగా ఉంది.

ఒక్క నియోజకవర్గంలో అభ్యర్ధిని రెడీచేసుకోలేకపోయిన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే జనాలు నమ్ముతారా ? ఏదో వీర్రాజు కాస్త కామెడీ చేస్తున్నారని అందరు కాసేపు నవ్వుకుని ఆ మాటలను మరచిపోతారంతే. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 0.56 శాతం. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు వచ్చిన ఓట్లు 3 శాతం అంటేనే ఏపీలో పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. రేపటి ఎన్నికల్లో అయినా ఇంతకన్నా భిన్నంగా ఉండే అవకాశంలేదు. ఎందుకంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ఏపీకి చేసిన మేలు ఏమీ లేకపోగా ప్రయోజనాలను తుంగలో తొక్కేసింది మాత్రం జనాలకు స్పష్టంగా కనిపిస్తోంది.

This post was last modified on June 3, 2022 10:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

4 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

8 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

9 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

12 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

13 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

14 hours ago